ఆ సంభాషణపై విచారణ అవసరం లేదు: సుప్రీం
సస్పెండైన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణతో తాను సంభాషణ జరిపినట్టు జస్టిస్ ఈశ్వరయ్య అంగీకరించినట్టు అఫిడవిట్ దాఖలు చేసినందున అందులోని వాస్తవాల నిర్ధరణకు విచారణ అవసరం లేదని...
నిర్ణయాధికారం హైకోర్టుదే
జస్టిస్ ఈశ్వర్యయ్య కేసులో పిల్ కొనసాగింపుపై సుప్రీం
దిల్లీ: సస్పెండైన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణతో తాను సంభాషణ జరిపినట్టు జస్టిస్ ఈశ్వరయ్య అంగీకరించినట్టు అఫిడవిట్ దాఖలు చేసినందున అందులోని వాస్తవాల నిర్ధరణకు విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వారిద్దరి మధ్య సంభాషణలో వాస్తవాల నిర్ధరణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్తో విచారణ కమిటీ వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దానిని సవాల్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘వారిద్దరి మధ్య సంభాషణలో వాస్తవాల నిర్ధరణకు ఓ నివేదిక సమర్పించాలని హైకోర్టు జస్టిస్ ఆర్.వి రవీంద్రన్కు విజ్ఞప్తి చేసింది. మా ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగిందని ఒప్పుకుంటూ పిటిషనర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు దాని ఇంగ్లిషు అనువాదాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించారు. సంభాషణ కొనసాగిందని పిటిషనరే ఒప్పుకుందన్నందున విచారణ అవసరం లేదు. ఒకవేళ విచారణ అవసరమని హైకోర్టు భావిస్తే పిటిషనర్కు వాదన వినిపించేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత దానిపై ఉత్తర్వులు వెలువరించాలి. హైకోర్టులో దాఖలైన కేసుపై మేము ఎటువంటి నోటీసులు జారీ చేయడం లేదు. ఆ కేసులోని మెరిట్స్పై వ్యాఖ్యలు చేయడం లేదు. పిల్ కొనసాగింపు (మెయిన్టైనబిలిటీ)పై హైకోర్టు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు’’ అని తీర్పులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం