Supreme Court: కొలీజియం మీటింగ్ విషయాలు బయటపెట్టం.. : సుప్రీంకోర్టు
న్యాయ మూర్తుల నియామకంపై కొలీజియం (collegium) సమావేశాల్లోని చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషిన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఇంటర్నెట్డెస్క్: న్యాయ మూర్తుల నియామకాలపై కొలీజియం (collegium)సమావేశాల్లోని చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషిన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఆ వివరాలను బహిర్గతం చేయలేమని పేర్కొంది. ‘‘అక్కడ (కొలీజియం సమావేశంలో) ఏం చర్చంచుకున్నా.. వాటిని బహిర్గతం చేయలేం. కేవలం ఆ సమావేశం తుది నిర్ణయాన్ని మాత్రమే వెల్లడిస్తాం’’ అని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. నాటి సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా వెలువడ్డ కథనాలపై పిటిషనర్ ఆధారపడ్డారని కోర్టు పేర్కొంది. తాము ఈ ఆంశంపై మరోసారి వ్యాఖ్యానించదల్చుకోలేదని.. ఈ పిటిషన్లో పసలేదని తెలిపింది. దీనిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇద్దరు న్యాయమూర్తుల నియామకం కోసం 2018 డిసెంబర్ 12వ తేదీన జరిగిన కొలీజియం (collegium) సమావేశంలో వివరాలను వెల్లడించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అంజలీ భరద్వాజ్ కోర్టును ఆశ్రయించారు. ఆమె తొలుత ఆర్టీఐ చట్టం కింద ఈ వివరాలు కోరగా.. సంబంధిత అధికారులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నాటి కొలీజియం(collegium) సమావేశంలో సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. కానీ, అప్పట్లో ఈ భేటీ వివరాలను సుప్రీం కోర్టు (Supreme Court) వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఆ తర్వాత 2019లో ఆ భేటీ వివరాలను వెబ్సైట్లో ఉంచకపోవడంపై జస్టిస్ లోకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?