పవార్‌జీ..తనకిష్టమైన పనిచేస్తున్నారు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు గాల్‌బ్లాడర్(పిత్తాశయం) శస్త్రచికిత్స విజయవంతమైన సంగతి తెలిసిందే.

Published : 31 Mar 2021 22:29 IST

ముంబయి: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు గాల్‌బ్లాడర్(పిత్తాశయం) శస్త్రచికిత్స విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, తనకిష్టమైన పని చేస్తున్నారంటూ పవార్ కుమార్తె సుప్రియా సూలే సామాజిక మాధ్యమాల్లో ఓ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బందికి  కృతజ్ఞతలు తెలియజేశారు. 

‘పవార్ సాహెబ్ తనకు అత్యంత ఇష్టమైన పని చేస్తున్నారు’ అంటూ ఈ రోజు ఉదయం శరద్ పవార్ వార్తా పత్రిక చదువుతున్నప్పటి చిత్రాన్ని సుప్రియా ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. ఆదివారం పొత్తికడుపులో నొప్పి కారణంగా పవార్ బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు..గాల్‌ బ్లాడర్‌లో ఉన్న రాయిని తొలగించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని