Surendran Pattel: బీడీ కార్మికుడి నుంచి అమెరికా జడ్జి.. కేరళ వాసి సక్సెస్ జర్నీ!
Surendran Pattel Journey: కేరళలో ఒకప్పుడు బీడీ కార్మికుడిగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు అమెరికాలో ఉన్నత పదవిని అలంకరించారు. పూటకు లేని రోజుల్లో సాయం కోరే స్థాయి నుంచీ నలుగురికీ న్యాయం అందించే ఎత్తుకు ఎదిగారు. ఆయనే సురేంద్రన్. ఆయనదే ఈ కథ.
ఇంటర్నెట్ డెస్క్: స్కూల్కెళ్లే రోజుల్లోనే కూలీగా అవతారం. పొట్ట నింపుకోవడానికి చదువుతూనే బీడీలు చుట్టే పని. తోటివారి సాయం చేయకపోతే చదువు కొనసాగించలేని పరిస్థితి. ఇదంతా గతం. సీన్ కట్ చేస్తే.. లాయర్గా మంచి పేరు. సుప్రీంకోర్టులోనూ పనిచేసిన అనుభవం. ఇప్పుడు అమెరికాలో జుడీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు. అచ్చం సినిమా కథను తలపించే ఈ కథ సురేంద్రన్ కె పటేల్ది. కేరళకు చెందిన ఈయన ఇటీవలే అమెరికాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన జర్నీ గురించి ఓ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. ఆ మ్యాగజైన్తో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. చిన్నతనం నుంచి అమెరికా వరకు సాగిన ప్రయాణాన్ని అందులో వివరించారు.
సురేంద్రన్ది కేరళలోని కాసర్గోడ్. రోజువారీ కూలీ కుటుంబంలో జన్మించారు. ఇంటిల్లిపాదీ పనిచేస్తే గానీ గడవని పరిస్థితి. దీంతో సురేంద్రన్ కూడా చిన్నతనం నుంచే పని చేసేవారు. సోదరితో కలిసి బీడీలు చుట్టడానికి వెళ్లేవారు. ఇతర కూలీ పనులూ చేసేవారు. ఇవన్నీ చేస్తూనే చదువుకొనేవారు. అయితే, పదో తరగతి తర్వాత చదువు మానేసి పూర్తిగా బీడీలు చుట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలా ఏడాది గడిచింది. పనిచేయడం ద్వారా ఆదాయం వస్తున్నా.. ఏదో వెలితి. చదువుకోకపోవడం వల్లే ఏదో కోల్పోతున్నానన్న బాధ ఆయనను వేధించింది. దీంతో చదువును తిరిగి కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు కూలి పనికెళ్లడం కొనసాగించారు.
చదువులో ముందుండే సురేంద్రన్.. కూలి పనులకెళ్లే క్రమంలో కళాశాలకు ఎక్కువగా సెలవులు పెట్టేవారు. దీంతో హాజరు తక్కువగా ఉండడం వల్ల పరీక్షలు రాయడానికి అనుమతించేది లేదని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో అధ్యాపకులను వేడుకోవడంతో చివరికి అనుమతించారని సురేంద్రన్ తన ఇంటర్వ్యూలో చెప్పారు. అనూహ్యంగా ఆ పరీక్షల్లో ఆయనే టాపర్గా నిలిచారు. ఆ తర్వాత కాలికట్ గవర్నమెంట్ లా కాలేజీలో చేరారు. అప్పుడూ ఆయనను ఆర్థిక ఇబ్బందులు వేధించాయి. స్నేహితుల సాయంతో మొదటి ఏడాది పూర్తి చేసిన సురేంద్రన్.. ఓ హోటల్లో పనిచేస్తూ మిగిలిన చదువునూ పూర్తి చేశారు. 1995లో లా డిగ్రీని పూర్తి చేసిన ఆయన.. 1996లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. సీనియర్ న్యాయవాదిగా కొన్ని కేసులు వాదించారు.
అమెరికా అలా..
2004లో శుభతో సురేంద్రన్కు వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు అమెరికాలో ఉద్యోగ అవకాశం వరించింది. దీంతో కుటుంబంతో కలిసి హ్యూస్టన్కు మారారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడిపోయారు. అమెరికా వెళ్లిన రెండేళ్ల తర్వాత టెక్సాస్లోని బార్ ఎగ్జామ్కు సురేంద్రన్ హాజరయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. తర్వాత అమెరికా చట్టాలను అర్థం చేసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్లో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్లో చేరారు. ఇంటర్నేషనల్ లాపై దృష్టిపెట్టారు. 2011లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కుటుంబ, క్రిమినల్, కమర్షియల్ వంటి వ్యవహారాల కేసులను వాదించేవారు. తర్వాత సొంతంగా ఓ లా సంస్థను నెలకొల్పారు. లాయర్గా అక్కడా మంచి పేరు తెచ్చుకున్నారు. 2020లో డెమోక్రటిక్ పార్టీ నుంచి జడ్జి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. ప్రచారంలో ప్రత్యర్థి తన యాసను వెక్కిరించినా.. దాన్నే ఆయన ఆయుధంగా మలచుకొన్నారు. ‘ప్రత్యర్థి యాసనే సహించలేని వ్యక్తి.. మంచి న్యాయమూర్తి ఎలా కాగలవు’ అంటూ ఎదురు ప్రశ్నించారు. తద్వారా అందరి హృదయాలనూ గెలుచుకుని డిస్ట్రిక్ట్ జడ్జిగా ఎన్నికయ్యారు. ప్రజలకు న్యాయం కలుగుతుందన్న విశ్వాసం కోర్టుల ద్వారా కలిగినప్పుడే న్యాయవ్యవస్థకు ఓ అర్థం ఉంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!