Joshimath crisis: జోషిమఠ్ విపత్తు వేళ.. సుష్మా స్వరాజ్ పాత ప్రసంగం వైరల్
జోషిమఠ్ విపత్తు వేళ కేంద్ర మాజీ మంత్రి, దివంగత భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్ (Sushma Swaraj) పాత వీడియో ఒకటి వైరల్గా మారింది. ఉత్తరాఖండ్లో అభివృద్ధి పేరుతో ప్రకృతిపై దాడులు జరుగుతున్నాయని అప్పట్లో ఆమె ఆరోపించారు.
దిల్లీ: ఉత్తరాఖండ్(Uttarakhand)లో పర్యాటక క్షేత్రమైన జోషిమఠ్ (Joshimath)లో భూమి కుంగడం పెను విపత్తుకు దారితీస్తోంది. ఇక్కడ భూమి శరవేగంగా కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితికి ఎన్టీపీసీ ప్రాజెక్టు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఉత్తరాఖండ్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై దివంగత నాయకురాలు సుష్మాస్వరాజ్ లోక్సభలో చేసిన ఓ ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది.
2013 జూన్లో ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని కేదార్నాథ్ (Kedarnath)లో భీకర వరదలు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ ప్రకృతి విలయం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న భాజపా (BJP).. ఆ ఏడాది సెప్టెంబరులో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. ఆ సమయంలో సుష్మా స్వరాజ్ (Sushma Swaraj) ప్రసంగిస్తూ.. ‘‘ఉత్తరాఖండ్లో అభివృద్ధి పేరుతో ప్రకృతి, పర్యావరణంపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దాని ఫలితమే కేదార్నాథ్ వరదలు. మనం ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నాం ? ఎవరి కోసం మిలియన్-బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం? వీటి కారణంగా ఏదో ఒక రోజు ప్రకృతి ఉగ్రరూపం దాల్చి.. ప్రతిదాన్నీ నాశనం చేస్తుంది. ఈ విలయం తర్వాత కూడా మనం కళ్లు తెరవకపోతే.. ఇంకెప్పుడు గ్రహిస్తాం?’’ అని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
జోషిమఠ్లో గత కొన్ని రోజులుగా భూమి కుంగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. భూమి కుంగిపోవడం వల్ల వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని ప్రమాదకర స్థాయికి దిగజారడంతో అధికారులు ప్రజలను అక్కడి నుంచి తరలించి కూల్చివేతలు ప్రారంభించారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడ్డవారు ఇప్పుడు మరో ప్రాంతానికి తరలివెళ్లాల్సి రావడంతో జోషిమఠ్ (Joshimath) ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులు సహా రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టింది. వాటి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనేది ప్రధాన ఆరోపణ. కాగా.. రెండేళ్ల క్రితం 2021 ఫిబ్రవరిలో జోషిమఠ్ (Joshimath)లో మెరుపు వరదలు సంభవించి కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
పద్మ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనను చూసి తానెంతో గర్విస్తున్నానని అన్నారు. -
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
అరవింద్ కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, అతనికి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్ను కోర్టు ఆదేశించింది. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) ఇంటివద్ద జరిగిన కాల్పులకు వాడిన తుపాకీ కోసం సూరత్లోని తపతీ నదిలో గాలింపు చేపట్టారు. -
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
మాజీ ప్రధానులపై మోదీ ఆరోపణలు చేయడంపై ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
ఎన్నికల వేళ.. ఎండలో నిలబడి ఓటు వేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన ఆకర్షిస్తోంది. -
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత
Mamata Banerjee on HC order: ఉపాధ్యాయ నియామక పరీక్ష రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
Supreme Court: లా కోర్సును మూడేళ్లకు తగ్గించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు మండిపడింది. అప్పుడు కోర్సులు ఎందుకని.. నేరుగా హైస్కూల్ తర్వాతే ప్రాక్టీస్ చేయండంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
Supreme Court: అత్యాచారానికి గురైన ఓ బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. -
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?
Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..! -
కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలి
మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్ కార్యకర్తలు తిహాడ్ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు
గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేణ్ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. -
భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్
పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ
సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. -
సీఆర్పీఎఫ్ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా రాయ్కోట్ వద్ద 32 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. -
అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!
అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. -
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ అరెస్టు
త్తీస్గఢ్లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!