Corona: అక్టోబర్‌ 31వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కమర్షియల్‌ విమాన సర్వీసుల......

Published : 28 Sep 2021 23:06 IST

మరోసారి పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కమర్షియల్‌ విమాన సర్వీసుల రద్దును అక్టోబర్‌ 31 వరకూ కొనసాగించనున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రకటించింది. కార్గో విమానాలతో పాటు ఎంపికచేసిన కొన్ని రూట్లలో మాత్రం ప్రయాణికుల విమానాలు నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా గతేడాది మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులనూ నిలిపివేయగా.. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తూ దశలవారీగా సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్‌ నెలాఖరు వరకు విమానాల రద్దు నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటనలో వెల్లడించింది. 

మరోవైపు, అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌, మాల్దీవులు, నెదర్లాండ్స్‌, జర్మనీ, ఖతార్‌ సహా దాదాపు 25 దేశాలతో భారత ప్రభుత్వం విమాన సర్వీసులు నడపేందుకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా దేశాలకు నడవనున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని