సొరంగంలో పట్టాలు తప్పిన రైలు..!

తూర్పు తైవాన్‌లోని ఓ సోరంగంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Updated : 02 Apr 2021 11:33 IST

తైవాన్‌: తూర్పు తైవాన్‌లోని ఓ సోరంగంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటికే 34 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించినట్లు పీటీఐ వార్తసంస్థ పేర్కొంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక  పట్టాలు తప్పడంతో లోపలికి చేరుకోవడం సహాయక బృందాలకు కష్టతరంగా మారింది. సొరంగంలో దాదాపు 70 మంది చిక్కుపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ రైలులో 350 మంది ఉన్నారు. 75 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

కొన్ని వార్త సంస్థలు మాత్రం మృతుల సంఖ్య 36 వరకు ఉండవచ్చని చెబుతున్నాయి.  ఈ రైలు టైటంగ్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని