ఉద్యోగం రాలేదు.. తాజ్‌మహల్‌లో బాంబు పెట్టా

ఆగ్రాలోని తాజ్‌ మహాల్‌ వద్ద బాంబు పెట్టినట్టు గురువారం ఉదయం పోలీసులకు ఫోన్‌కాల్‌ వచ్చింది.

Updated : 04 Mar 2021 11:55 IST

చారిత్రక కట్టడానికి నకిలీ బెదిరింపు కాల్‌

 

దిల్లీ: ఆగ్రాలోని ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌లో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. తాజ్‌మహల్‌లో బాంబ్‌ ఉందంటూ ఈ ఉదయం పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. అయితే అది నకిలీ కాల్‌ అని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

తాజ్‌ మహల్‌ వద్ద బాంబు పెట్టినట్టు గురువారం ఉదయం పోలీసులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘సైనిక నియామకాల్లో అవతకవలు జరుగుతున్నాయి. నన్ను రిక్రూట్‌ చేసుకోలేదు. అందుకే తాజ్‌మహల్‌లో బాంబ్‌ పెట్టా. త్వరలోనే అది పేలుతుంది’’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసినట్లు ఆగ్రా ఎస్పీ శివరామ్‌ యాదవ్‌ తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్‌, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. తాజ్‌ మహల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులను బయటకు పంపి బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తోతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు అని పోలీసులు నిర్ధారించారు. ఫిరోజాబాద్‌కు చెందిన వ్యక్తి ఈ కాల్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని