Afghanistan: కాబుల్ సమీపంలో తాలిబన్లు.. ఏ క్షణమైనా దేశ రాజధానిలోకి!
అఫ్గానిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబుల్కు సమీపంలో ఉన్న మరో నగరం...
మెరుపు వేగంతో రాష్ట్రాల హస్తగతం
రక్తపాతం జరగనివ్వను: అధ్యక్షుడు అష్రఫ్
కాబుల్: అఫ్గానిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబుల్కు సమీపంలో ఉన్న మరో నగరం జలలాబాద్ను సైతం ఆక్రమించారు. వేకువజామున ప్రజలు నిద్ర లేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్ జెండాలు పాతుకుపోయాయి. ప్రస్తుతం వారు కాబుల్కు అత్యంత సమీపంలో ఉన్నారు. జలాలబాద్ ఆక్రమణతో కాబుల్ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఏ క్షణంలోనైనా తాలిబన్ మూకలు దేశ రాజధానిలోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్ పౌర ప్రభుత్వ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ముందు కేవలం రెండు ప్రత్యామ్నాయాలు మిగిలాయి. ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించడం లేదా వారితో భీకర పోరు కొనసాగించడం. మరో రెండు రోజుల్లో అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అంతకుముందు దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని వారు శనివారం పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఐదో అతిపెద్ద రాష్ట్రమైన మజార్-ఏ-షరీఫ్పైనా ఆధిపత్యం సాధించారు. ప్రస్తుతం కాబూల్కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఏ క్షణమైనా వారు దేశ రాజధానిలోకి చొరబడే పరిస్థితులు నెలకొన్నాయి. కాందహార్లోని రేడియో స్టేషన్ను ఆక్రమించిన తాలిబన్లు... ఇక నుంచి ఇస్లామిక్ వార్తలనే ప్రసారం చేస్తామని ప్రకటించారు.
మరింత రక్తపాతం జరగనివ్వను.. అష్రఫ్ ఘనీ
తాజా పరిస్థితుల నేపథ్యంలో... దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ శనివారం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘మరింత రక్తపాతం జరగనివ్వను. దేశంలో శాంతి, సుస్థిరతల స్థాపనపై దృష్టి సారిస్తాను. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఆపాల్సి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా- అఫ్గాన్ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పించే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్లు చర్చించారు.
తక్షణమే దాడులను ఆపండి: గుటెరస్
తాలిబన్ల దురాక్రమణలతో అఫ్గాన్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు తక్షణమే దాడులను నిలిపివేయాలన్నారు. బలప్రయోగం సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీస్తుందని, అఫ్గాన్ను ఒంటరి దేశంగా మార్చుతుందని పేర్కొన్నారు. ప్రజలపైనా, జర్నలిస్టులపైనా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాలికలు, మహిళల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించడం హృదయ విదారకంగా ఉందన్నారు. వెంటనే చర్చలు ప్రారంభించాలని తాలిబన్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్లీజ్! మమ్మల్ని రానీయండి..దిల్లీ జేఎన్యూకు అఫ్గాన్ విద్యార్థుల మొర
దిల్లీలోని జేఎన్యూలో చదువుతున్న అఫ్గాన్ విద్యార్థులు... కరోనా సమయంలో తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో తాము తిరిగి వస్తామని, క్యాంపస్లో తలదాచుకునేందుకు అనుమతివ్వాలని వర్సిటీ ఉపకులపతికి విజ్ఞప్తులు చేస్తున్నారు. వారి తరఫున విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతలు వీసీకి లేఖ రాశారు. ‘‘అఫ్గాన్లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చిక్కుకుపోయిన మన విద్యార్థులు వెనక్కు వచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోండి. వారు క్యాంపస్లో ఉండేందుకు వసతులు కల్పించాలి’’ అని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రిజిస్ట్రార్ రవికేశ్ తెలిపారు.
భారత్ను పొగుడుతూనే...మోదీ సర్కారుకు హెచ్చరిక!
దేశంలోని 18 రాష్ట్రాలను వశపరుచుకున్న క్రమంలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహేల్ షహీన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘అఫ్గాన్ ప్రజలకు భారత్ సాయం చేయడం, జాతీయ ప్రాజెక్టులు చేపట్టడం హర్షణీయమే. కానీ, మా దేశంలో వారు సైనిక చర్యలు చేపట్టకూడదు. మా దేశంలో నివసిస్తున్న సిక్కులు, హిందువులు తమ మతపరమైన ఆచారాలు పాటించుకోవచ్చు. వేడుకలు చేసుకోవచ్చు. ఇక్కడి రాయబార కార్యాలయాలకు, దౌత్య అధికారులకు ఎలాంటి హానీ ఉండదు. ప్రజలు తమంతట తామే తాలిబన్లకు లొంగిపోతున్నారు. సామాన్యులను చంపడం, హింసించడం ప్రభుత్వం చేస్తున్న పని. దాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మేం సిద్ధమే. కానీ, ఇందుకు ప్రభుత్వమే ముందుకు రావడంలేదు’’ అని షహీన్ పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్, అమెరికా తదితర దేశాలు అఫ్గాన్ నుంచి తమ అధికారులను వెనక్కి రప్పించాయి. కాగా అఫ్గాన్ నుంచి సిక్కులు, హిందువులు సహా 20 వేల మందిని తరలించనున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్