Panjshir: తాలిబన్ల చేతుల్లోకి పంజ్షేర్..? ఖండించిన ఉత్తర కూటమి సేనలు
పంజ్షేర్: అమెరికా బలగాల ఉపసంహరణతో విజృంభించిన తాలిబన్లు అఫ్గాన్ మొత్తాన్ని అక్రమించుకున్నారు. కానీ ఒక్క పంజ్షేర్ మాత్రం వారికి ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలింది. తాజాగా ఈ ప్రాంతం కూడా తమ వశమైనట్లు తాలిబన్ వర్గాలు వెల్లడించాయి. అయితే తాలిబన్ల ప్రకటనను ఉత్తరకూటమి సేనలు ఖండిస్తున్నాయి. పంజ్షేర్ ఇంకా తమ ఆధీనంలోనే ఉందని చెబుతున్నాయి.
‘‘దేవుడి దయతో మొత్తం అఫ్గానిస్థాన్ మా నియంత్రణలోకి వచ్చేసింది. పంజ్షేర్ కూడా మా కమాండ్లోకి వచ్చేసింది’’ అని తాలిబన్ కమాండర్ ఒకరు తాజాగా ప్రకటించడం సంచలనంగా మారింది. పంజ్షేర్పై విజయంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నట్లు సోషల్మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై పూర్తి స్పష్టత రాలేదు.
తాలిబన్ల ప్రకటనను తాలిబన్ వ్యతిరేక శక్తుల నాయకులు అమరుల్లా సలేహ్, అహ్మద్ మసూద్ ఖండించారు. పంజ్షేర్ ఇంకా తమ నియంత్రణలో ఉందని, తాలిబన్లకు తాము తలొగ్గేది లేదని వెల్లడించారు. ‘‘తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు కొనసాగుతూనే ఉంది. మా మాతృభూమి కోసం మేం పోరాడుతూనే ఉంటాం’’ అని సలేహ్ ట్విటర్లో వెల్లడించారు. అయితే పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయని సలేహ్ చెప్పుకొచ్చారు. ఉత్తరకూటమికి చెందిన ఇతర నేతలు కూడా తాలిబన్ ప్రకటనను తోసిపుచ్చారు.
కాబుల్కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే పంజ్షేర్ ప్రావిన్సు దశాబ్దాల నుంచి తాలిబన్లకు కొరకరాని కొయ్యే! హిందుకుష్ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యం. పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ప్రావిన్సు ప్రస్తుతం అహ్మద్ మసూద్ నాయకత్వంలో ఉంది. తాలిబన్ల విజృంభణ అనంతరం అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సహా గత ప్రభుత్వంలోని పలువురు నేతలు పంజ్షేర్కే వచ్చేశారు. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు తాలిబన్లు భీకర పోరాటం జరుపుతున్నారు. అయితే తాలిబన్లను ఉత్తర కూటమి సేనలు కూడా అంతే దీటుగా నిలువరిస్తున్నాయి. ఈ యుద్ధంలో పదుల సంఖ్యలో తాలిబన్లు మృతిచెందినట్లు వార్తలు కూడా వచ్చాయి.
తాలిబన్ల సంబరాల్లో 17 మంది మృతి..
పంజ్షేర్ తాలిబన్ల వశమైందన్న వార్తలతో ముష్కరులు సంబరాల్లో మునిగిపోయారు. కాబుల్లో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 17 మంది మరణించగా.. 41 మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: కాబుల్లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
India News
Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
Liger: షారుఖ్ సూపర్హిట్ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో మెంటార్గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి