Afghnisthan: తాలిబన్ల అరాచకాలు.. సెక్స్ బానిసలుగా స్త్రీలు!
స్త్రీల హక్కులను గౌరవిస్తామని, వారినీ పనిచేసుకునేందుకు అనుమతిస్తామన్న తాలిబన్ల హామీ నీటి మూటలే అని అర్థమవుతోంది. మునుపటి స్వభావానికి భిన్నంగా వారేమీ ప్రవర్తించడం లేదనే వాదనలకు బలం చేకూరుస్తూ వారి క్రూరత్వాన్ని చాటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: స్త్రీల హక్కులను గౌరవిస్తామని, వారినీ పనిచేసుకునేందుకు అనుమతిస్తామన్న తాలిబన్ల హామీ నీటి మూటలే అని అర్థమవుతోంది. మునుపటి స్వభావానికి భిన్నంగా వారేమీ ప్రవర్తించడం లేదనే వాదనలకు బలం చేకూరుస్తూ వారి క్రూరత్వాన్ని చాటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అఫ్గానిస్థాన్కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ న్యాయమూర్తి వారి దారుణాలను వెలుగులోకి తెచ్చారు. అమెరికాలో నివాసముంటున్న ఆమె.. ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు.
తమకు సరిగ్గా వండిపెట్టలేదన్న కారణంతో ఉత్తర అఫ్గానిస్థాన్కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు. తాలిబన్ ఫైటర్లకు వండిపెట్టాలని అక్కడి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్ బానిసలుగా మార్చేందుకు కొన్ని వారాలుగా ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆయా ప్రాంతాల్లో ఉండే యువతులను తమ ఫైటర్లకిచ్చి వివాహం చేయాలనీ అక్కడి కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఓ వైపు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ మహిళలను స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని ఇంకో వైపు హామీలు ఇస్తున్నారని ఆయూబీ చెప్పారు. మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను పారిపోయి వచ్చినట్లు చెప్పారు.
మరోవైపు తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే పలువురు మహిళా జర్నలిస్టులు తమ గోడును ప్రపంచానికి వెళ్లబోసుకున్నారు. మహిళలకు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ తాలిబన్లు ప్రకటించిన కొద్దిరోజులకే ఈ ఘటనలు జరుగడం గమనార్హం. దీంతో మహిళల హక్కుల పరిరక్షణకు వారిచ్చిన హామీ నీటిమీద రాతలే అని తేలిపోయింది. ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఈ దారుణాలను చూస్తుంటే అఫ్గాన్లో పరిస్థితులు మున్ముందు మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
మూడు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని.. మధ్యప్రదేశ్లో మాత్రం ఏం జరిగిందో అనే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
Chennai Rains: కొట్టుకుపోయిన కార్లు.. రన్వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు
Chennai Rains: భారీ వర్షాలతో చెన్నై నగరం దాదాపు స్తంభించింది. పలు చోట్ల వరద బీభత్సం సృష్టించింది. ఎయిర్పోర్టులోకి వరద చేరి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. -
Udhayanidhi Stalin: నా మాటలను భాజపా వక్రీకరించింది.. సనాతన వివాదంపై ఉదయనిధి
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తన వ్యాఖ్యలను భాజపా, ప్రధాని మోదీ వక్రీకరించి వాడుకొన్నారని ఆరోపించారు. -
Mary Milliben: ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడు.. మూడు రాష్ట్రాల్లో భాజపా విజయంపై అమెరికన్ సింగర్
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ (Mary Milliben) ప్రశంసల జల్లు కురింపించారు. -
PM Modi: ‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్లో చూపించొద్దు’: కాంగ్రెస్కు మోదీ సూచన
PM Modi: అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు.. నెగెటివిటీని ప్రచారం చేసేవారిని ఓడించారని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఫలితాలపై స్పందించారు. -
Chennai: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. స్తంభించిన చెన్నై
మిగ్జాం తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం దాదాపు స్తంభించిపోయింది. -
మొయిత్రా అంశం అలజడి రేపుతుందా!
అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం మీద ఉన్న భాజపా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో సిద్ధమవుతోంది. -
రక్తదానంపై ప్రచారం చేస్తూ 17,700 కి.మీ. పాదయాత్ర
దిల్లీకి చెందిన కిరణ్వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 17,700 కిలోమీటర్లు తిరిగారు. -
గోపాల్ భార్గవ.. తొమ్మిదోసారి..
మధ్యప్రదేశ్లో భాజపా దిగ్గజ నేతల్లో ఒకరైన గోపాల్ భార్గవ (71) రహ్లీ నియోజకవర్గంపై తన పట్టును మరోసారి చాటుకున్నారు. -
అటువంటి సందర్భంలో పరిమిత బెయిల్ చట్టవిరుద్థమే: సుప్రీం కోర్టు
ఏదైనా కేసులో నిందితుడు బెయిల్ పొడిగింపు పొందడానికి అర్హుడుగా తేలిన సందర్భంలో అతనికి పరిమిత కాల బెయిల్ మంజూరు చేయడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
-
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
-
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
-
Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్లో ఉంటున్నారు: గౌతమ్కృష్ణ
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం