Tamil Nadu: చెరువులో దాక్కున్న నేరస్థుడిని పట్టించిన డ్రోన్ కెమెరా..

చెరువులో దాక్కున్న నేరస్థుడిని డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడులో జరిగింది.

Published : 19 Mar 2022 15:21 IST

చెన్నై: చెరువులో దాక్కున్న నేరస్థుడిని డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. తెన్కాసి జిల్లాకు చెందిన జకుల్ హమీద్ అనే వ్యక్తిపై పలు పోలీస్‌స్టేషన్‌లలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరికీ కనిపించకుండా పచనాయకంపొట్టై పరిసరాల్లో హమీద్ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. తన వద్దకు ఎవరూ రావద్దంటూ స్థానికులను బెదిరించాడు. ఈ క్రమంలో పశువులను మేపుతూ అటుగా వెళ్లిన ఓ వ్యక్తిపై హమీద్ కత్తితో దాడి చేశాడు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం వెళ్లారు. దీంతో అతడు చెరువు వైపు వెళ్లి కనిపించకుండా పోయాడు. హమీద్ చెరువులోనే నక్కినట్లు అంచనాకు వచ్చిన పోలీసులు.. డ్రోన్ కెమెరాలతో గాలించారు. చెరువు మధ్యలో.. పొదల్లో నక్కిన హమీద్‌ను డ్రోన్ కెమెరా గుర్తించింది. అతడు పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని