Venkaiahnaidu: ఉపరాష్ట్రపతిని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిశారు. స్టాలిన్‌తో

Updated : 25 Apr 2022 17:22 IST

చెన్నై: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిశారు. స్టాలిన్‌తో పాటు తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్, పలువురు ఎంపీలు, పార్లమెంటరీ పార్టీ నాయకులు టి.ఆర్.బాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.వి.ఇరై అన్బు ఉపరాష్ట్రపతితో సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా వెంకయ్య, స్టాలిన్‌ వివిధ అంశాలపై చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని