Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
సేలంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించిన పార్టీ కార్యకర్తను మరో మంత్రి కేఎన్ నెహ్రూ మెడపట్టి నెట్టేసిన వీడియో వైరల్గా మారింది.
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం కూర్చుకునేందుకు కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర మంత్రి ఎస్ఎం నాజర్ రాయి విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి కేఎన్ నెహ్రూ పార్టీ కార్యకర్తను మెడపట్టి నెట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సేలంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పార్టీ కార్యకర్తలను కలిసేందుకు స్టేజ్పై నిల్చుని ఉన్నారు. కార్యకర్తలు వరుసలో వస్తూ ఆయన్ను కలిసి వెళుతున్న క్రమంలో ఓ కార్యకర్త ఉదయనిధి స్టాలిన్తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న మున్సిపల్శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఆ కార్యకర్తను మెడ పట్టి తోసేసిన వీడియోలో రికార్డయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ‘‘ ఈ డీఎంకే మంత్రి ప్రజల్ని కొడతాను అని ప్రమాణం చేసినట్లున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ మంత్రి రాళ్లు విసిరారు. తాజాగా మరో మంత్రి ప్రజల్ని తోసేస్తున్నారు. వీళ్లకు ఇది రోజువారీ కార్యక్రమంలా మారింది. మంత్రులను కాపాడుకునేందుకు ప్రజలకు రక్షణ కవచాలు అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రిని కోరుతున్నా’’ అని అన్నామలై ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.