Tawang Sector: సాంకేతికత దన్నుగా చైనాపై కన్ను.. సరిహద్దుల్లో ఆధునిక పరికరాల మోహరింపు
ఇటీవలి కాలంలో తూర్పు సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్సీసీ)కు అతి సమీపంలో చైనా తన సైనిక శిక్షణ కార్యకలాపాలను ముమ్మరం చేయడంతోపాటు బలగాలను మోహరించినట్లు పలువురు సైన్యాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే! చైనా బలగాలు పెట్రోలింగ్ సైతం...
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో తూర్పు సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్సీసీ)కు అతి సమీపంలో చైనా తన సైనిక శిక్షణ కార్యకలాపాలను ముమ్మరం చేయడంతోపాటు బలగాలను మోహరించినట్లు పలువురు సైనికాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే! చైనా బలగాలు పెట్రోలింగ్ సైతం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పకడ్బందీ నిఘా కోసం భారత్ ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డ్రాగన్ అనుమానాస్పద కదలికలు, పెట్రోలింగ్ను నిశితంగా ట్రాక్ చేసేందుకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక నిఘా పరికరాలను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ), ఇతర టెక్నాలజీల సాయంతో అభివృద్ధి చేసిన పరికరాలను ఇప్పటికే తూర్పు సెక్టార్లో ఎల్ఏసీ వెంబడి ఏర్పాటు చేసింది.
ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ..
ఇక్కడి 5 మౌంటెయిన్ డివిజన్ సిగ్నల్స్ రెజిమెంట్కు చెందిన మేజర్ భవ్య శర్మ ఇటీవల ‘ఫేస్ రికగ్నైజేషన్’ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. అరుణాచల్ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లోని వివాదాస్పద ప్రాంతాలైన నమ్కా చు లోయ, సుమ్డోరోంగ్ చు తదితర ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలను ట్రాక్ చేసేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్.. ఎల్ఏసీకి అతి సమీపంలో వచ్చే చైనా సిబ్బందిని గుర్తించడంలో సహాయపడుతుంది. అంతకుముందే స్టోర్ చేసి ఉన్న డేటాతో సరిపోల్చుతూ పనిచేస్తుంది. ఇందులో ఫేస్ డిటెక్షన్, ఫేస్ రికగ్నైజేషన్ అనే రెండు మాడ్యుళ్లు ఉంటాయి. ఏఐ కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. ప్రత్యక్ష ప్రసారం, రికార్డు చేసిన వీడియో లేదా ఫొటోల నుంచి మనుషులను గుర్తుపడుతుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఇది పనిచేయడం విశేషం.
డివిజనల్ కేంద్రంలో విశ్లేషించి..
దీంతోపాటు దేశీయంగా అభివృద్ధి చేసిన పాన్ టిల్ట్ హ్యాండ్హెల్డ్ థర్మల్ ఇమేజర్, శాటిలైట్లు, రాడార్లు, గ్రౌండ్ సెన్సార్లు, డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనా(యూఏవీ)లను భారత్ సైన్యం మోహరించింది. అన్ని నిఘా వనరుల నుంచి వచ్చిన సమాచారాన్ని తొలుత ఇక్కడి రూపా ప్రాంతంలోని డివిజనల్ నిఘా కేంద్రంలో విశ్లేషిస్తారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి చేరవేస్తారు. డిటెక్షన్ కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా ఆయా పరికరాల నుంచి సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చేందుకు సాంకేతికత విశేషంగా దోహదపడుతున్నట్లు 5 మౌంటెయిన్ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ జుబిన్ ఏ మిన్వాలా తెలిపారు. తద్వారా సకాలంలో తగిన చర్యలు తీసుకోవడానికి సాధ్యపడుతోందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. -
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు