వచ్చే ఏడాది తేజస్ మార్క్-2 సిద్ధం
దేశీయ యుద్ధవిమానం ‘తేజస్’కు సంబంధించిన మరింత శక్తిమంతమైన రూపాన్ని వచ్చే ఏడాది సిద్ధం చేస్తామని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఛైర్మన్ ఆర్.మాధవన్ తెలిపారు....
శక్తిమంతమైన ఇంజిన్, ఆయుధాలు, ఆధునిక వ్యవస్థలు దీని సొంతం
2025 నుంచి ఉత్పత్తి
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ ఛైర్మన్ వెల్లడి
దిల్లీ: దేశీయ యుద్ధవిమానం ‘తేజస్’కు సంబంధించిన మరింత శక్తిమంతమైన రూపాన్ని వచ్చే ఏడాది సిద్ధం చేస్తామని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఛైర్మన్ ఆర్.మాధవన్ తెలిపారు. తేజస్ మార్క్-2గా పిలిచే ఈ లోహ విహంగంలో శక్తిమంతమైన ఇంజిన్, ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం, కొత్త తరం ఎలక్ట్రానిక్ పోరాట వ్యవస్థ, అత్యాధునిక ఏవియానిక్స్ వంటివి ఉంటాయని చెప్పారు. ఈ యుద్ధవిమాన ఆకృతికి సంబంధించిన పని శరవేగంగా జరుగుతోందని తెలిపారు. 2025 నుంచి ఈ జెట్ల ఉత్పత్తి ప్రారంభం కావొచ్చని వివరించారు.
ఈ యుద్ధవిమానానికి సంబంధించిన మునుపటి వెర్షన్ తేజస్ మార్క్-1ఎ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమ్మతి తెలిపిన సంగతి తెలిసిందే. రూ.48వేల కోట్లతో 83 జెట్లను హెచ్ఏఎల్ సరఫరా చేస్తుంది. తేజస్ మార్క్-2 మరింత శక్తిమంతమైందని మాధవన్ చెప్పారు. దీని పొడవు ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ దూరం ప్రయాణించగలదని తెలిపారు. దీని నిర్వహణ కూడా సులువని పేర్కొన్నారు. ఇందులో మరింత మెరుగైన నెట్వర్క్ కేంద్రీకృత యుద్ధ వ్యవస్థలు ఉంటాయన్నారు. ‘‘తేజస్ మార్క్-2.. వచ్చే ఆగస్టు-సెప్టెంబరులో సిద్ధమయ్యే అవకాశం ఉంది. అయితే దాని తొలి గగనవిహారానికి కొంత సమయం పడుతుంది. మొదటి హై స్పీడ్ పరీక్ష 2023లో ప్రారంభం కావొచ్చు’’ అని ఆయన చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తేజస్ మార్క్-2లో అమర్చే ఆయుధాలపై తర్వాతి దశలో నిర్ణయం ఉంటుందన్నారు. తేజస్.. బహుళ ప్రయోజన సూపర్సోనిక్ యుద్ధవిమానం. ముప్పు తీవ్రంగా ఉండే శత్రు గగనతలాల్లో పోరాడే సత్తా దీనికి ఉంది. గాల్లో పోరాటం, శత్రువుపై ఎదురుదాడి, నిఘా, నౌకా విధ్వంసక సామర్థ్యం దీని సొంతం.
‘ఐదోతరం’ పైనా కసరత్తు
ఐదోతరం యుద్ధవిమానం ‘అడ్వాన్స్డ్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్’ (ఆమ్కా) ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నామని మాధవన్ చెప్పారు. అది ప్రాథమిక డిజైన్ దశలో ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం హెచ్ఏఎల్, డీఆర్డీవో, ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ సంస్థగా మారకుండా చూసేందుకు ప్రైవేటు సంస్థలకు 50.5 శాతం వాటా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘ఆమ్కా’ మొదటి యుద్ధవిమానం 2026 కల్లా సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని 2030 నుంచి ఉత్పత్తి దశకు చేరే వీలుందని తెలిపారు.
ఇవీ చదవండి...
ఒత్తిడితో ఒప్పందానికి ఒప్పుకోం
వీగర్లపై చైనా మరోసారి ఉక్కుపాదం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’