Mu, C.1.2 Variants: భారత్లో ఈ వేరియంట్ల జాడల్లేవ్..!
ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు ఈ రెండు రకాలు భారత్లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్టియం INSACOG వెల్లడించింది.
జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం వెల్లడి
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకూ ఈ రెండు రకాలు భారత్లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన జీనోమ్ కన్సార్టియం INSACOG వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఆందోళనకరమైన డెల్టా వేరియంట్తోపాటు దాని ఉపరకాల ప్రభావమే అధికంగా ఉందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన C.1.2 రకం మనదేశంలో బయటపడనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్ సోకిన వారికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టేందుకు ఇప్పటికే ఉన్న సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని INSACOG స్పష్టం చేసింది.
ఆ రెండు దేశాల్లోనే ఎక్కువ..!
ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా బయటపడుతున్న కరోనా వేరియంట్ల తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వాటి సంక్రమణ రేటు, తీవ్రత ఆధారంగా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (VOI), వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC)గా ప్రకటిస్తోంది. ఈ మధ్య కొత్తగా వెలుగు చూసిన Mu (B.1.621)తో పాటు C.1.2లను ప్రస్తుతానికి ఆందోళనకరం కాని (VOI) వేరియంట్లుగానే ప్రకటించింది. అయితే, Mu ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా తక్కువే ఉందని.. ప్రస్తుతం వీటి తీవ్రత 0.1శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అత్యధికంగా కొలంబియాలో 39శాతం, ఈక్వెడార్లో 13శాతం కేసుల్లో వీటి ప్రభావం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ గుర్తించిన ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే కొత్తగా వెలుగు చూసిన C.1.2 రకం ఎన్నో ఎక్కువ మ్యుటేషన్లకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే వీటి మ్యుటేషన్లో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇతర రకాల మ్యుటేషన్ రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో (ఏడాదికి 41.8 మ్యుటేషన్లు) మార్పులు చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీబాడీలను తప్పించుకునే గుణం కూడా C.1.2 సీక్వెన్సుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక వీటికితోడు టీకాల వల్ల వచ్చే యాంటీబాడీలను ఏమార్చే గుణం మరో ప్రమాదకరమైన Mu రకానికి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వీటి ప్రాబల్యం, తీవ్రతపై పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
సార్వత్రిక ఎన్నికల్లో ఏఐతో సృష్టించిన నకిలీ సమాచార కట్టడికి మెటా ప్రత్యేకంగా ‘ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
తొలి లోక్సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది ‘సెక్యూరిటీ డిపాజిట్’ కోల్పోయినట్లు ఈసీ విశ్లేషణలో వెల్లడైంది. -
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
తమిళనాడులోని సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ నాయకుడి సేవలను గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ? -
Himanta Biswa Sarma: ‘మేం గేట్లు తెరిస్తే..’: కాంగ్రెస్కు హిమంత వార్నింగ్
కాంగ్రెస్పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ప్రధాని మోదీ(Modi) సూర్యుడని కొనియాడారు. -
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. -
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
మిగతా నటీనటుల యాక్టింగ్ నచ్చినప్పటికీ.. అమితాబ్ బచ్చనే (Amitabh Bachchan) తనకు ఇష్టమైన నటుడని భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. -
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వడంలో విఫలమైనందుకు పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
Liquor Policy Case: దిల్లీ మద్యం కుంభకోణంలో భారాస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది. -
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్