Mu, C.1.2 Variants: భారత్లో ఈ వేరియంట్ల జాడల్లేవ్..!
ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు ఈ రెండు రకాలు భారత్లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్టియం INSACOG వెల్లడించింది.
జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం వెల్లడి
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకూ ఈ రెండు రకాలు భారత్లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన జీనోమ్ కన్సార్టియం INSACOG వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఆందోళనకరమైన డెల్టా వేరియంట్తోపాటు దాని ఉపరకాల ప్రభావమే అధికంగా ఉందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన C.1.2 రకం మనదేశంలో బయటపడనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్ సోకిన వారికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టేందుకు ఇప్పటికే ఉన్న సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని INSACOG స్పష్టం చేసింది.
ఆ రెండు దేశాల్లోనే ఎక్కువ..!
ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా బయటపడుతున్న కరోనా వేరియంట్ల తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వాటి సంక్రమణ రేటు, తీవ్రత ఆధారంగా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (VOI), వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC)గా ప్రకటిస్తోంది. ఈ మధ్య కొత్తగా వెలుగు చూసిన Mu (B.1.621)తో పాటు C.1.2లను ప్రస్తుతానికి ఆందోళనకరం కాని (VOI) వేరియంట్లుగానే ప్రకటించింది. అయితే, Mu ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా తక్కువే ఉందని.. ప్రస్తుతం వీటి తీవ్రత 0.1శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అత్యధికంగా కొలంబియాలో 39శాతం, ఈక్వెడార్లో 13శాతం కేసుల్లో వీటి ప్రభావం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ గుర్తించిన ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే కొత్తగా వెలుగు చూసిన C.1.2 రకం ఎన్నో ఎక్కువ మ్యుటేషన్లకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే వీటి మ్యుటేషన్లో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇతర రకాల మ్యుటేషన్ రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో (ఏడాదికి 41.8 మ్యుటేషన్లు) మార్పులు చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీబాడీలను తప్పించుకునే గుణం కూడా C.1.2 సీక్వెన్సుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక వీటికితోడు టీకాల వల్ల వచ్చే యాంటీబాడీలను ఏమార్చే గుణం మరో ప్రమాదకరమైన Mu రకానికి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వీటి ప్రాబల్యం, తీవ్రతపై పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కాదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్