China: సెలబ్రిటీలకు చైనా హెచ్చరిక.. వ్యభిచారం కేసులో స్టార్ పియానిస్ట్ అరెస్టు!
సామాజిక దిగ్గజ సంస్థలు మొదలు వినోద రంగం వరకూ అన్ని రంగాల్లో ఆంక్షలు విధిస్తున్న చైనా.. సెలబ్రిటీలపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా వ్యభిచారం ఆరోపణలపై ప్రముఖ అంతర్జాతీయ పియానిస్ట్...
బీజింగ్: సామాజిక దిగ్గజ సంస్థలు మొదలు వినోద రంగం వరకూ అన్ని రంగాల్లో ఆంక్షలు విధిస్తున్న చైనా.. సెలబ్రిటీలపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా వ్యభిచారం ఆరోపణలపై ప్రముఖ అంతర్జాతీయ పియానిస్ట్ లీ యండీని అరెస్టు చేసింది. చైనా ప్రభుత్వం అమలుచేసే క్రమశిక్షణ చర్యలను ఎవరైనా సవాలు చేస్తే నిరాశ తప్పదని పరోక్షంగా హెచ్చరించింది. వినోద పరిశ్రమపై అధ్యక్షుడు షీ జిన్పింగ్ కఠినంగా వ్యవహరిస్తున్నారనే విషయం తాజా అరెస్టుతో మరోసారి స్పష్టంగా తెలుస్తోందని అక్కడి అధికారిక మీడియా పేర్కొంది.
వ్యభిచారం ఆరోపణల కేసులో ప్రముఖ అంతర్జాతీయ పియానిస్ట్ లీ యండీతో పాటు మరో సెక్స్ వర్కర్ను అరెస్టు చేసినట్లు చైనా అధికారిక మీడియా పీపుల్స్ డైలీ వెల్లడించింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, నైతికత, చట్టంపై గౌరవం వంటి విషయాల్లో కొందరు సెలబ్రిటీలు తరచుగా ప్రశ్నలు వేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎవరైనా సరే క్రమశిక్షణ, చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనన్న చైనా మీడియా.. వాటిని అతిక్రమిస్తే నిరాశ తప్పదని స్పష్టం చేసింది.
గాయకుల అసోసియేషన్ నుంచి తొలగింపు
లీ యండీని అరెస్టు చేసినట్లు బీజింగ్ పోలీసులు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. నలుపు, తెలుపు రంగులే కాకుండా ప్రపంచంలో చాలా రంగులుంటాయి. ప్రతిఒక్కరూ వీటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కంగారు పడొద్దని బీజింగ్ పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు లీ అరెస్టుపై చైనా గాయకుల సంఘం స్పందించింది. అసాంఘిక చర్యల్లో భాగస్వామ్యమైనట్లు ఆరోపణలు రావడంతో తమ అసోసియేషన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
వినోద రంగంపై కఠిన వైఖరి..
గతకొంత కాలంగా పలు రంగాలపై షీ జిన్పింగ్ ప్రభుత్వం ఆంక్షలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టెక్ కంపెనీలు మొదలు, స్థిరాస్తి రంగంతో పాటు చివరకు విద్యార్థులపైనా నియంత్రణలు అమలుచేస్తోంది. వారంలో కేవలం కొన్ని గంటలు మాత్రమే వీడియో గేమ్లు ఆడుకోవాలని ఇదివరకే ఆదేశించింది. ఇక విదేశీ ప్రభావంతో వినోద రంగం కూడా అసభ్యకరంగా మారుతోందని భావిస్తున్న షీ జిన్పింగ్ ప్రభుత్వం.. ఆ రంగాన్ని గాడిన పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా వివాదాస్పద కామెంట్లు చేసే సినిమా స్టార్లను నిషేధించడం, వారి పారితోషికాల్లో కోతలు, సెలబ్రిటీ కల్చర్కు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలు చేపడుతోంది.
ఇదిలా ఉంటే, నటీనటులపై విరుచుకుపడటం చైనాకు ఇది కొత్తేమీ కాదు. చైనాలో విక్కీ ఝావోగా పేరుతెచ్చుకున్న ఝావో వీ అనే నటిపై ఇప్పటికే అణచివేత మొదలుపెట్టింది. ఆమెను చైనా సామాజిక మాధ్యమాల నుంచి బహిష్కరించిన చైనా ప్రభుత్వం.. వీబోతో పాటు ఇతర సైట్లలో ఆమె నటించిన చిత్రాలను, వెబ్ సిరీస్లను తొలిగించింది. ఇక చైనాలో కాలుష్యం, పిల్లల అక్రమ రవాణాపై వరుస కథనాలు రాసిన కారణంగా చైనీస్-అమెరికన్ బ్లాగర్ చార్లెస్ షియూను 2013లో అరెస్టు చేసింది. 2018లో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న నటి ఫాన్ బింగ్బింగ్ను కూడా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఇలా క్రమశిక్షణారాహిత్యంతో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడే సెలబ్రిటీలపై చైనా ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతూనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్