కరోనా ఎఫెక్ట్.. పొదుపు, ఎంజాయ్మెంట్ ఉండాలంటున్న భారతీయుడు..!
కరోనా మహమ్మారి తర్వాత ఇంటికే పరిమితమైన ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారట. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ తమ అభిరుచులకే ప్రాధాన్యం అంటున్నారట. డెలాయిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారతీయులు ప్రస్తుత ఆలోచనా విధానం ఎలా ఉందో వెల్లడైంది.
డెలాయిట్ సర్వేలో వెల్లడి
దిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత ఇంటికే పరిమితమైన ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారట. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ తమ అభిరుచులకే ప్రాధాన్యం అంటున్నారట. డెలాయిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారతీయులు ప్రస్తుత ఆలోచనా విధానం ఎలా ఉందో వెల్లడైంది.
‘భారతీయులు అర్థవంతంగా ఖర్చు చేస్తున్నారు. వర్తమానంలో జీవించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళ్లడంతో పాటు తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే బ్రాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు’ అని ఆ సర్వే వెల్లడించింది. అలాగే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. జీవితంలో సమతుల్యం ఉండాలని కోరుకుంటున్నారని తెలిపింది. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకోవడంతో పాటు తమ అభిరుచులు, వస్తువుల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారని పేర్కొంది. ఒకవైపు 74 శాతం మంది ద్రవ్యోల్బణం గురించి కంగారు పడుతుండగా.. అదే సమయంలో 85 శాతం మంది రానున్న నాలుగు వారాల్లో ప్రయాణాలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 68 శాతం మంది రెస్టారెంట్లకు వెళ్లడం సురక్షితమేనని భావిస్తుండగా..74 శాతం మంది రానున్న ఆరు నెలల్లో కొత్త వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. 65 శాతం మంది విమానాల్లో ప్రయాణించడం, హోటళ్లలో బస చేయడంలో ఏ ఇబ్బంది లేదనుకుంటున్నారని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది మొదలైన కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పటికీ కొనసాగుతోంది. భారత్లో మొదటి, రెండు దశల్లో వైరస్ విజృంభించడంతో అల్లాడిపోయిన ప్రజలు కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిర్వహించిన సర్వేలో ప్రజలు ఆకాంక్షలు వెల్లడయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్