Vaccination: పేరుకుపోతున్న టీకా నిల్వలు.. రాష్ట్రాల వద్ద 15 కోట్ల డోసులు!
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్ 5 నాటికి దాదాపు 108కోట్ల డోసులను పంపిణీ చేశారు.
10 కోట్ల మంది రెండో డోసుకు దూరం
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్ 5 నాటికి దాదాపు 108 కోట్ల డోసులను పంపిణీ చేశారు. మరో 15 కోట్ల 54లక్షల డోసులు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్దే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇప్పటివరకు మొత్తం 116 కోట్ల డోసులను ఉచితంగా అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన సమయంలో టీకా కొరత ఉన్నట్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రాలు.. ప్రస్తుతం పంపిణీలో మాత్రం డీలా పడినట్లు తెలుస్తోంది.
10 కోట్ల మంది రెండో డోసుకు దూరం..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై పది నెలలు కావొస్తున్నా.. ఇప్పటివరకు 32 శాతం మందికి మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించారు. కనీసం 77 శాతం అర్హులకు ఒక డోసు పంపిణీ చేశారు. వీరిలో దాదాపు 10 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మధ్యే ఆందోళన వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్ మందకొడిగా సాగుతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లి టీకా అందించాలని సూచించింది.
48 జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువే..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి డోసు అందించడంలో రాష్ట్రాలన్నీ ముందంజలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా పలు జిల్లాలు మాత్రం వెనుకబడిపోయాయి. దేశంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన (18 ఏళ్ల వయసు పైబడిన) వారిలో సరాసరి 77 శాతం మంది కనీసం ఒకడోసు అందుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా 48 జిల్లాల్లో మాత్రం కేవలం 50శాతం మంది మాత్రమే ఒకడోసు తీసుకున్నారు. మొత్తంగా 13 రాష్ట్రాల్లో ఈ సమస్య ఉండగా ఈశాన్య రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీలో మరింత వెనుకబడిపోయాయి. నాగాలాండ్లో ఓ జిల్లాలో కేవలం 16 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందింది. ఝార్ఖండ్లో మొత్తం 24 జిల్లాల్లో 10జిల్లాల్లో వ్యాక్సిన్ పంపిణీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
దేశవ్యాప్తంగా సెప్టెంబరులో రోజువారీగా 78 లక్షల డోసులను పంపిణీ చేయగా అక్టోబర్ నాటికి 56 లక్షలకు తగ్గింది. తొలిడోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు గడువు దాటిపోయినప్పటికీ చాలా మంది ముందుకు రావడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు డోసు విషయంలో ప్రజలు కాస్త ఉదాసీనత వహిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని.. దీనికితోడు పండగల సీజన్ కూడా మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న జిల్లా అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
Chandrayaan: చంద్రుడి ఉపరితలంపై భారతీయుడు అడుగు పెట్టేవరకు భారత జాబిల్లి యాత్రలు కొనసాగుతాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. -
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. తొలి దశకు సంబంధించి ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది. -
మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ
తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టత ఇచ్చారు. -
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ఓ జంట తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది. -
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు. -
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కోర్టు వెలుపలి నేర అంగీకారాలు బలహీన సాక్ష్యాధారాలే
న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది. -
12వ తరగతి తర్వాత మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు అనుమతివ్వాలి
ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. -
సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
-
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్
-
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
-
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
-
మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ