Sameer Wankhede: మంత్రి గారూ.. ఆరోపించడం కాదు, రుజువు చూపించండి..!
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తన మతమార్పిడి గురించి వస్తోన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. తన మొదటి వివాహం గురించి మాలిక్ ట్విటర్లో ఫొటో షేర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
మాలిక్ చేసిన ట్వీట్కు బదులిచ్చిన వాంఖడే
ముంబయి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ (Aryan Khan) అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే (Sameer Wankhede) తన మతమార్పిడి గురించి వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. తన మొదటి వివాహం గురించి మాలిక్ ట్విటర్లో ఫొటో షేర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
‘నా తండ్రి హిందువు. నా తల్లి ముస్లిం. వారిద్దరంటే నాకెంతో ప్రేమ. నేను ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని మా అమ్మ కోరింది. అదే నెల నేను స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద నా వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నాను. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే.. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చట్టబద్ధంగా మేం విడిపోయాం. నేను పుట్టుకతోనే హిందువును. ఇప్పటికీ హిందువునే. ఎలాంటి మతమార్పిడి జరగలేదు. అదే జరిగుంటే.. నవాబ్ మాలిక్ ఆ ధ్రువపత్రం చూపించాలి. నా మొదటి వివాహానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని నా తండ్రి చూపిస్తారు’ అని వాంఖడే స్పష్టం చేశారు.
నిఖానామా జరిగింది: సమీర్ భార్య
మాలిక్ షేర్ చేసిన చిత్రంపై సమీర్ వాంఖడే రెండో భార్య క్రాంతి రేడ్కర్ మీడియాతో మాట్లాడారు. ‘నిఖానామా నిజమే. ఆ వివాహం జరిగింది. కానీ, సమీర్ తన కులం, మతం మార్చుకోలేదు. మా అత్తయ్య ముస్లిం కావడంతో ఆమె సంతోషం కోసం ఈ పద్ధతిలో వేడుక జరిగింది. అలాగే నవాబ్ మాలిక్ షేర్ చేసిన జన్మ ధ్రువపత్రం నిజమైంది కాదు’ అని వెల్లడించారు. సమీర్ వాంఖడేకు ముస్లిం పద్ధతిలో జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోను ఈ రోజు మాలిక్ ట్విటర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మూడు వారాల క్రితం ముంబయిలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు (Cruise Ship Party)లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సమీర్ వాంఖడేపై మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకోవైపు ఆర్యన్ ఖాన్ విడుదలకు అతడి తండ్రి షారుఖ్ (Sharukh Khan) నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఈ కేసులో సాక్షి ఆరోపించాడు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్సీబీ (NCB) వాంఖడేపై విచారణ జరుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య