Vaccination Record: ఛావి అగర్వాల్‌..ప్రధాని ఆమె పాట విన్నారు..

భారత్‌ 100 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చి చరిత్ర సృష్టించిన రోజు ఛావి అగర్వాల్‌కు చాలా ప్రత్యేకంగా మారింది. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీనే. అదెలాగంటారా..?

Published : 21 Oct 2021 18:35 IST

దిల్లీ: భారత్‌ 100 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చి చరిత్ర సృష్టించిన రోజు ఛావి అగర్వాల్‌కు చాలా ప్రత్యేకంగా మారింది. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీనే. అదెలాగంటారా..?

టీకా రికార్డు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. ఛావి అగర్వాల్‌(25) కూడా టీకా వేయించుకునేందుకు అక్కడికి వచ్చారు. ఆమె అక్కడే ప్రాంగణంలో ఉండగా.. అటుగా వెళ్తోన్న మోదీని చూసి, ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. పట్టలేని సంతోషంతో ప్రధానిని గట్టిగా పిలిచారు. తననెవరో పిలుస్తున్నారని, వెనక్కి తిరిగిన మోదీకి ఛావి కనిపించారు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. 

ఇంతకాలం ఎందుకు టీకా తీసుకోలేదని మోదీ ఆమెను ప్రశ్నించారు. దగ్గు కారణంగా కుదరలేదని చెప్పారు. అలాగే ఆమె ఇష్టాఇష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాటలు పాడటమంటే ఇష్టమని తెలుసుకొని.. ఒక పాట పాడించుకొని విన్నారు. ఆ అమ్మాయి అభ్యర్థన మేరకు ఆమెతో కలిసి ఒక ఫొటో కూడా తీసుకున్నారు. మళ్లీ త్వరలో కలుస్తానని మాట కూడా ఇచ్చారు. దాంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ఛావికి ఈ రోజు ప్రత్యేకంగా మారిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని