UK: మా సమస్య కొవిషీల్డ్తో కాదు.. టీకా ధ్రువపత్రంతో
క్వారంటైన్ నిబంధనల విషయంలో యూకే తిరకాసు
దిల్లీ: కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో బ్రిటన్ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. తిరకాసు పెట్టింది. కొవిషీల్డ్ను ఆమోదించిన టీకాల జాబితాలో చేర్చుతూ తన ప్రయాణ నిబంధనలను సవరించింది. అయితే తమ సమస్య టీకాతో కాదని, టీకా ధ్రువపత్రంతో అంటూ చెప్పుకొచ్చింది. అందుకే కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాల్సి ఉందని తాజాగా వెల్లడించింది. తమకు కొవిన్ ధ్రువపత్రం జారీ ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని.. దీనిపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపింది.
అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్ నిబంధలను బ్రిటన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. దాని ప్రకారం భారత్, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. ఆ దేశాల నుంచి వచ్చే వారు.. తమ ప్రయాణానికి ముందుగా, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనల పట్ల భారత్లో నిరసన వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో ఈ నిబంధనలు వివక్షా పూరితంగా ఉన్నాయంటూ మంగళవారం కేంద్రం తీవ్రంగా స్పందించింది. భారత్లో తయారైన టీకాలను వినియోగించుకున్న బ్రిటన్.. ఇలాంటి నిబంధనలు విధించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బ్రిటన్ స్పందించింది.
టీకా ధ్రువపత్రంతో సమస్యేం లేదు: భారత్
తమ అభ్యంతరం కొవిషీల్డ్ గురించి కాదని, టీకా ధ్రువపత్రంతోనే అని బ్రిటన్ అనుమానం వ్యక్తం చేయగా.. టీకా ధ్రువపత్రంతో ఎలాంటి సమస్య లేదని భారత ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కొవిన్ యాప్, టీకా ధ్రువపత్రం జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని జాతీయ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. ‘కొవిన్, టీకా ధ్రువపత్రం విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ ఉంది. అలాగే మేం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థలతో కూడా చర్చలు కొనసాగిస్తున్నాం. ఇటీవల యూకే రాయబారి నన్ను కలిశారు. వారు ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ శర్మ మీడియాకు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
RGUKT: బాసర ట్రిపుల్ ఐటీలో నిలిచిన విద్యుత్ సరఫరా.. చీకట్లోనే భోజనాలు!
-
India News
venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
-
General News
AP ICET results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Vijayasai Reddy: అంతా ఆయన వల్లే.. జైరాం రమేశ్పై ఎంపీ విజయసాయి విసుర్లు
-
Sports News
Modi: సింధు.. ఛాంపియన్లకే ఛాంపియన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Hyderabad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం