Corona: జనవరి 4న ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా కొత్త కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కూడా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వివరాలు వెల్లడించింది. అలాగే ఇంతకుముందు రెండు డోసులుగా తీసుకున్న టీకానే ప్రికాషనరీ డోసు కింద తీసుకోవాలని పేర్కొంది.
దేశంలో 8 రోజుల్లో 6 రెట్లు పెరిగిన కొత్త కేసులు
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కూడా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వివరాలు వెల్లడించింది. అలాగే ఇంతకుముందు రెండు డోసులుగా తీసుకున్న టీకానే ప్రికాషనరీ డోసు కింద తీసుకోవాలని పేర్కొంది.
జనవరి 4న 25.2 లక్షల కేసులు..
జనవరి 4న ప్రపంచ వ్యాప్తంగా 25.2 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వెలుగుచూసిన దగ్గరి నుంచి ఈ స్థాయిలో కేసులు ఎప్పుడూ రాలేదు. జనవరి నాలుగుతో ముగిసిన వారంలో దాదాపు 65 శాతం కేసులు అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ నుంచే వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో గత 8 రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరిగాయి. డిసెంబర్ 29న 0.79 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జనవరి 5 నాటికి 5.03 శాతానికి పెరిగిందని పేర్కొంది. మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, దిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్, గుజరాత్లో వైరస్ ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. దేశంలో 28 జిల్లాల్లో వారపు పాజిటివిటీ రేటు 10 శాతంపైనే ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు 147 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకాలు అందిస్తున్నారు. దేశంలో 7.40 కోట్ల మంది ఆ వయస్సువారు టీకా తీసుకునేందుకు అర్హులని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే గతంలో రెండు డోసులుగా తీసుకున్న టీకానే ఇప్పుడు ప్రికాషనరీ డోసుగా ఇస్తామని వెల్లడించింది. కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారికి కొవిషీల్డ్ ఇవ్వనున్నట్లు చెప్పింది.
నాలుగు గంటల్లో ఒమిక్రాన్ గుర్తింపు..
‘ఒమిక్రాన్ వేరియంట్ నగరాల్లో విస్తరిస్తోన్న ప్రధాన వేరియంట్. దాని వ్యాప్తిని కట్టడిచేసేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి’ అని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ విజ్ఞప్తి చేశారు. టాటా ఎండీ, ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో ఒమిక్రాన్ను గుర్తించే ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దీనిని డీసీజీఐ ఆమోదించిందన్నారు. ఇది నాలుగు గంటల్లో ఫలితం ఇస్తుందని చెప్పారు.
దేశంలో కరోనావైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ.. తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులుగా 30వేలకు పైగా నమోదయిన కొత్త కేసులు.. నేడు ఒక్కసారిగా 58 వేలకు చేరాయి. ముందురోజు కంటే 55 శాతం అధికంగా నమోదయ్యాయి. వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజా వ్యాప్తికి దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు రెండు వేల మార్కు దాటేశాయి. భారత్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్