- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Covid Second Wave: 645 మంది చిన్నారులు అనాథలయ్యారు
దిల్లీ: రెండో దశలో కొవిడ్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కన్నవారిని దూరం చేసి ఎంతోమంది చిన్నారులను అనాథలను చేసింది. సెకండ్ వేవ్ సమయంలో కొవిడ్తో 645 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయినట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే 28 మంది దేశవ్యాప్తంగా 645 మంది చిన్నారులు అమ్మానాన్నలను కోల్పోయారని స్మృతి ఇరానీ తెలిపారు. అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్లో 158 మంది, ఆంధ్రప్రదేశ్లో 119, మహారాష్ట్రలో 83, మధ్యప్రదేశ్లో 73 మంది చిన్నారులు అనాథలైనట్లు పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా కన్నవారిని దూరం చేసుకున్న చిన్నారులకు ఆర్థికంగా అండగా ఉండాలని, వారు చదువు కొనసాగించేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరినట్లు ఆమె తెలిపారు.
అంతేగాక, అలాంటి చిన్నారులను ఆదుకోవడం కోసం ప్రధాని మోదీ ఇటీవలే ఓ ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పేరుతో ప్రత్యేక పథకం ప్రకటించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఆ పథకం ద్వారా అనాథలైన చిన్నారులకు విద్య, ఆరోగ్య సేవలు కల్పించడంతో పాటు వారు 18ఏళ్లు వచ్చేసరికి రూ.10లక్షల నిధిని సమకూర్చనున్నట్లు తెలిపారు. 18ఏళ్ల తర్వాత అందులో కొంత మొత్తాన్ని.. వారు ఉన్నత చదువులకు ఉపయోగించుకునేలా నెలనెలా స్టయిఫండ్ రూపంలో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మిగతా మొత్తాన్ని వారు 23ఏళ్లు వచ్చాక ఇస్తామని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Deepak - Virat : దీపక్కు అంత సులువేం కాదు.. కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు!
-
Politics News
CM Kcr: దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలి: వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్
-
Politics News
Karnataka: మంత్రి ఆడియో లీక్ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!
-
General News
Andhra News: నిబంధనల ప్రకారమే రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయశాఖలోకి: మంత్రి సత్యనారాయణ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Karthikeya 2: కృష్ణతత్వం వర్కవుట్ అయింది.. నార్త్కు నచ్చేసింది!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్టొట చేరిన నిఘా నౌక..!
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!