Covid Vaccine:12 ఆయుధాలతో.. కొవిడ్పై భారత్ పోరు..!
దేశంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు 8 వ్యాక్సిన్ల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మరో 4 చికిత్సా విధానాలకు ఆమోదం తెలిపింది.....
ఇప్పటికే అనుమతి పొందిన 8 టీకాలు, 4 ఔషధాలు
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: కరోనా మహమ్మారి వెలుగు చూసి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లతో ప్రపంచ దేశాలు వైరస్పై పోరాటం చేస్తున్నాయి. ఇటు భారత్ కూడా కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇలా మొత్తంగా ఇప్పటివరకు వైరస్ను ఎదుర్కొనే 8 వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి ఇవ్వగా మరో 4 చికిత్సా విధానాలకు ఆమోదం తెలిపింది. కొత్త వేరియంట్లతో కొవిడ్ మహమ్మారి సవాల్ విసురుతున్న వేళ.. భారత్ చెంత ఉన్న అస్త్రాలు ఇవే..
కొవిషీల్డ్: యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సహకారంతో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ను భారత్లో కొవిషీల్డ్ పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. స్పైక్ ప్రొటీన్ లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది.
కొవాగ్జిన్: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన స్వదేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఇన్యాక్టివేటెడ్ వైరస్ను వినియోగించి దీన్ని రూపొందించారు.
స్పుత్నిక్-వి: రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ను రూపొందించింది. Ad5, Ad26 అనే రెండు అడినోవైరస్ల మిశ్రమంతో దీన్ని అభివృద్ధి చేశారు. స్వల్ప జలుబు, ఫ్లూ తరహా జబ్బులకు ఈ అడినో వైరస్లు కారణమవుతాయి.
జైకోవ్-డీ: డీఎన్ఏ ఆధారంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ను అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసింది. ఈ టీకాను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఎటువంటి సిరంజీలు అవసరం లేదు. సూది అవసరం లేని ఓ ప్రత్యేక అప్లికేటర్తో ఈ వ్యాక్సిన్ అందిస్తారు. వైరస్ జన్యుక్రమాన్ని మార్పు చేసిన బ్లూప్రింట్ జన్యుపదార్థాన్ని వ్యాక్సిన్ రూపంలో శరీరంలోకి పంపిస్తారు.
మోడెర్నా: అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ దీన్ని రూపొందించింది. రెండు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ వ్యాక్సిన్ను మెసెంజర్ ఆర్ఎన్ఏ (mRNA) జెనెటిక్ కోడ్ సహాయంతో అభివృద్ధి చేశారు. అంటువ్యాధికి సంబంధించి ఏదైనా కరోనా వైరస్ శరీరంలోని ప్రవేశిస్తే వాటికి ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంపొందించేందు ఈ వైరల్ ప్రొటీన్ శిక్షణ ఇస్తుంది.
జాన్సన్ అండ్ జాన్సన్: అడినోవైరస్ వెక్టార్తో తయారు చేసిన సింగిల్ డోసు టీకా. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ దీన్ని రూపొందించింది. మార్పులు చేసిన చిన్న వైరస్ (కొవిడ్-19కు కారణమయ్యే వైరస్ కాదు) ఇందులో ఉంటుంది. దీన్ని వెక్టార్ వైరస్గా పరిగణిస్తారు. ఇది స్వయంగా పునరుత్పత్తి కాలేదు. అందుచేత దీనివల్ల ఎటువంటి హాని ఉండదు. రోగనిరోధక ప్రతిస్పందనలు ఉత్పత్తి చేసేలా శరీరంలోని కణాలకు సూచనలు ఇస్తుంది.
కార్బివాక్స్: హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఇ ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. కొవిడ్కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ స్పైక్ ప్రొటీన్కు చెందిన రెసిప్టార్ బైండింగ్ డొమైన్ (RBD) వర్షన్ ఇందులో ఉంటుంది. దీన్ని రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. హైపటైటిస్-బి వ్యాక్సిన్ మాదిరి సాంకేతికతతో దీన్ని రూపొందించారు.
కొవొవాక్స్: అమెరికాకు చెందిన నొవావాక్స్ దీన్ని రూపొందించింది. భారత్లో కొవొవాక్స్ పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని తయారు చేస్తోంది. వైరస్లోని శుద్ధి చేసిన భాగాలు ఉండే ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీని పెంపొందించేందుకు దోహదం చేస్తుంది.
కొవిడ్ చికిత్సలో భాగంగా ఇప్పటి వరకు నాలుగు రకాల పద్ధతులకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCO ఆమోదం తెలిపింది.
ఇవీ చికిత్సా విధానాలు..
మొల్నుపిరవిర్: అమెరికా సంస్థ మెర్క్ తయారు చేసిన మొల్నుపిరవిర్ యాంటీవైరల్ ఔషధానికి అనుమతి లభించింది. ఈ ఔషధాన్ని భారత్లో దాదాపు 13 కంపెనీలు తయారు చేయనున్నాయి. వ్యాధి ముప్పు అధికంగా ఉన్నవారికి అత్యవసర వినియోగం కింద దీన్ని అందించనున్నారు.
టోసిలిజుమాబ్: ఈ ఔషధాన్ని స్విట్జర్లాండ్కు చెందిన రోచే సంస్థ తయారు చేసింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల కోసం తయారు చేసిన ఈ ఔషధాన్ని కొవిడ్ బాధితులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనేందుకు ఉపయోగించనున్నారు. సిప్లా సంస్థ భారత్లో దిగుమతి, సరఫరా చేయనుంది.
2-DG (2-deoxy-D-glucose): డీఆర్డీఓ (DRDO) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. నోటి ద్వారా దీన్ని తీసుకోవాలి. Glycolysis పద్ధతి వైరస్ పెరుగుదలను నిరోధిస్తుంది.
REGEN-COV2 యాంటీబాడీ కాక్టెయిల్: Casirivimab, Imdevimab మోనోక్లోనల్ యాంటీబాడీల మిశ్రమంతో ఈ కాక్టెయిల్ యాంటీబాడీ చికిత్స అందిస్తారు. ముఖ్యంగా స్వల్ప నుంచి ఓ మాదిరి లక్షణాలున్న కొవిడ్ బాధితులకు ఇస్తారు. ఈ యాంటిబాడీలు ల్యాబ్లో కృత్రిమంగా చేసినవి. మానవ కణాల్లోకి ప్రవేశించకుండా వైరస్లోని స్పైక్ ప్రోటీన్ను అడ్డుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!