Flight: శునకం కోసం విమానం బిజినెస్‌ కేబిన్‌ బుకింగ్‌

పెంపుడు శునకంతో సహా ముంబయి నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఓ యజమాని ఎయిరిండియా విమానంలోని బిజినెస్‌ కేబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.2.50

Published : 19 Sep 2021 07:09 IST

ముంబయి: పెంపుడు శునకంతో సహా ముంబయి నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఓ యజమాని ఎయిరిండియా విమానంలోని బిజినెస్‌ కేబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.2.50 లక్షలు వెచ్చించినట్లు సమాచారం. బుధవారం ఉదయం 9 గంటలకు ముంబయి విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో బయలుదేరినట్లు తెలిసింది. ఈ విమానంలో బిజినెస్‌ క్లాస్‌ కేబిన్‌ సీట్లు 12 ఉంటాయి. దీంతో ముంబయికి చెందిన ప్రయాణికుడు శునకంతో సహాయ ప్రయాణించేందుకు 12 సీట్లనూ బుక్‌ చేసుకున్నారు. సాధారణంగా ముంబయి నుంచి చెన్నైకి ఎయిరిండియా బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ రూ.20,000 ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని