Taiwan Vs China: తైవాన్ సైన్యంలో అ‘మెరిక’లు
తైవాన్ విషయంలో చైనా ఇటీవల దూకుడు పెంచింది. పదే పదే యుద్ధ విమానాలను పంపిస్తూ ఆ దేశాన్ని కవ్విస్తోంది. ఆక్రమణ సన్నాహాలూ చేస్తోంది!
రహస్యంగా కమాండోలను మోహరించిన అగ్రరాజ్యం
చైనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాడు ట్రంప్ వ్యూహం
‘వాల్స్ట్రీట్ జర్నల్’ తాజా కథనంలో వెల్లడి
వాషింగ్టన్: తైవాన్ విషయంలో చైనా ఇటీవల దూకుడు పెంచింది. పదే పదే యుద్ధ విమానాలను పంపిస్తూ ఆ దేశాన్ని కవ్విస్తోంది. ఆక్రమణ సన్నాహాలూ చేస్తోంది! అయితే- ‘వాల్స్ట్రీట్ జర్నల్’లో తాజాగా ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు డ్రాగన్కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బుల్లి దేశమైన తైవాన్పై సైనిక చర్యలకు దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోక తప్పనిసరి పరిస్థితులను కల్పిస్తోంది. తైవాన్ సైన్యంలో అమెరికా కమాండోలు, మెరీన్ సిబ్బంది ఉన్నారని.. ఆ దేశ సైనికులకు అగ్రరాజ్య మిలిటరీ అధికారులు శిక్షణనిస్తున్నారని ఆ కథనంలో బయటపడటమే ఇందుకు కారణం. ‘వాల్స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన ఒక స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ సైనికులు (డజను మంది), ఒక గ్రూపు మెరీన్ సిబ్బంది దాదాపు ఏడాది నుంచి తైవాన్లో ఉంటున్నారు. అక్కడి సైనికులు, మెరీన్ సిబ్బందికి యుద్ధవ్యూహాలపై వారు శిక్షణ ఇస్తున్నారు. కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దూకుడు పెంచడం, తైవాన్ గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి యుద్ధ విమానాలను పంపిస్తుండటం వంటి దౌర్జన్యపూరిత చర్యలకు ఉపక్రమిస్తుండటంతో.. తైవాన్కు అండగా నిలిచేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ వారిని అక్కడికి పంపించారు.
గతవారం చైనాకు చెందిన 50కి పైగా యుద్ధ విమానాలు తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయి. వాటిలో న్యూక్లియర్ బాంబర్లు కూడా ఉన్నాయి. కొన్నాళ్లపాటు తైవాన్ను కవ్వించి.. ఆపై తేలిగ్గా ఆక్రమణకు దిగొచ్చని చైనా ఇన్నాళ్లూ భావించింది. కానీ వాల్స్ట్రీట్ జర్నల్ కథనంతో దానికి పెద్ద షాక్ తగిలినట్లయింది. తైవాన్లోకి సైన్యాధికారులను పంపిన అంశంపై మాట్లాడేందుకు తాజాగా పెంటగాన్ తిరస్కరించింది. తైవాన్ కూడా పెదవి విప్పలేదు. ట్రంప్ హయాంలో పెంటగాన్లో పనిచేసిన క్రిస్టఫర్ మాయర్ మాత్రం.. తైవాన్కు సైన్యాన్ని పంపే ప్రతిపాదనను తాము బలంగా పరిశీలించామని పేర్కొన్నారు.
అప్పటివరకు చైనాను అడ్డుకునేలా..
యుద్ధ సన్నద్ధత అనేది కేవలం గంటల్లో జరిగే పని కాదు. హఠాత్తుగా చోటుచేసుకునే దండయాత్రలను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం! దాడి జరిగినప్పుడు ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేయడం చాలా ముఖ్యం. చైనా-తైవాన్కు మధ్య దూరం కేవలం 150 కిలోమీటర్లే. చైనా దళాలు వాయు, జల మార్గాల్లో ఈ దూరాన్ని వేగంగా అధిగమించి తైవాన్లో ప్రవేశించడం అత్యంత తేలిక. జపాన్లోని ఓకినావాలో ఉన్న అమెరికా సైన్యం అక్కడికి చేరేలోపే చైనా ఆక్రమణ పూర్తయ్యే అవకాశాలుంటాయి. మరోవైపు- తైవాన్లో తమ సైన్యాన్ని నేరుగా ఉంచడం అమెరికాకు సాధ్యం కాదు. అలా చేస్తే చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి తైవాన్ సైన్యాన్నే బలోపేతం చేస్తే.. వారే తొలి దాడిని సమర్థంగా ఎదుర్కొంటారు! మిత్రపక్షాలు రంగంలోకి దిగేందుకు తగినంత సమయం లభిస్తుంది. ఈ వ్యూహంతో ట్రంప్ తైవాన్కు తమ మిలిటరీ శిక్షకులను పంపించారు. కొందరు కమాండోలనూ రహస్యంగా అక్కడ మోహరించారు.
తర్వాత వచ్చేవారూ తైవాన్కు అండగా నిలిచేలా..
కమాండోలు, మిలిటరీ శిక్షకులను పంపడంతోనే ట్రంప్ ఆగిపోలేదు. తాను అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొన్ని రోజుల ముందు.. ఇండో-పసిఫిక్ వ్యూహ పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో తైవాన్తో తమ సంబంధాలను, చైనాతో పొంచి ఉన్న ముప్పును సవివరంగా తెలియజేశారు. చైనాను సమర్థంగా ఎదుర్కొనేలా తైవాన్ను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోయినా.. తర్వాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టేవారూ తప్పనిసరిగా తైవాన్ను కాపాడాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రస్తుతం బైడెన్ నేతృత్వంలోని సర్కారు ఈ వ్యూహంలో ఎలాంటి మార్పులూ చేయలేదు. మరోవైపు- తైవాన్ 2015 వరకూ తమ రక్షణ రంగాన్ని బాగా విస్మరించిందని, ప్రభావవంతమైన ఆయుధాలను కొనుగోలు చేయలేదని ట్రంప్ హయాంలో జాతీయ భద్రత డిప్యూటీ సలహాదారుగా పనిచేసిన మ్యాట్ పొటింగర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశం వద్ద ఉన్నవి.. చైనాతో యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ధ్వంసమవుతాయని అభిప్రాయపడ్డారు. చైనాను దీటుగా ఎదుర్కోవాలంటే తైవాన్ అత్యాధునిక నౌకా విధ్వంసక క్షిపణులు, స్మార్ట్ సీ మైన్స్లను కొనుగోలు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!