Corona: రెండేళ్ల ఆయుర్దాయాన్ని మింగేసిన కరోనా!
కరోనా మహమ్మారి.. జనజీవితాన్ని అనేక విధాలుగా అస్తవ్యస్తం చేసింది. దీనివల్ల భారత్లో సగటు ఆయుర్దాయం దాదాపు రెండేళ్ల మేర తగ్గింది.
ముంబయి: కరోనా మహమ్మారి.. జనజీవితాన్ని అనేక విధాలుగా అస్తవ్యస్తం చేసింది. దీనివల్ల భారత్లో సగటు ఆయుర్దాయం దాదాపు రెండేళ్ల మేర తగ్గింది. ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ (ఐఐపీఎస్) శాస్త్రవేత్తలు గణాంకపరమైన విశ్లేషణ చేసి ఈ విషయాన్ని గుర్తించారు. మహమ్మారి కారణంగా జనన సమయంలో సగటు ఆయుర్దాయం అటు పురుషుల్లోను ఇటు మహిళల్లోను తగ్గినట్లు వారు పేర్కొన్నారు. వీరి నివేదిక ప్రకారం.. 2019లో పురుషుల సగటు ఆయుర్దాయం 69.5 ఏళ్లు కాగా.. మహిళల విషయంలో అది 72 ఏళ్లుగా ఉండేది. 2020లో అది 67.5 ఏళ్లు (పురుషులకు), 69.8 ఏళ్ల (మహిళలకు) తగ్గింది. కొవిడ్-19 మహమ్మారి.. 39-69 ఏళ్ల వయసున్న పురుషుల ప్రాణాలను ఎక్కువగా హరించింది. దీనివల్ల సగటు ఆయుర్దాయం పడిపోయింది. ‘‘ఏదో ఒక మహమ్మారి విజృంభించినప్పుడల్లా సగటు ఆయుష్షు తగ్గిపోతుంటుంది. ఆఫ్రికా దేశాలపై హెచ్ఐవీ-ఎయిడ్స్ విరుచుకుపడినప్పుడు కూడా ఇది క్షీణించింది. ఆ వ్యాధిని అదుపులోకి తెచ్చాక సగటు ఆయుర్దాయం మళ్లీ పుంజుకుంది’’ అని ఐఐపీఎస్ డైరెక్టర్ కె.ఎస్.జేమ్స్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్