Prison: ఒకే జైలులో 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకిన ఘటన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది. నౌగావ్ జిల్లా కేంద్ర కారాగారం, ప్రత్యేక కారాగారంలోని ఖైదీలకు సెప్టెంబర్లో హెచ్ఐవీ పరీక్షలు జరిపారు.
అస్సాంలో నౌగావ్ కేంద్ర కారాగారంలో కలకలం
నౌగావ్: ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకిన ఘటన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది. నౌగావ్ జిల్లా కేంద్ర కారాగారం, ప్రత్యేక కారాగారంలోని ఖైదీలకు సెప్టెంబర్లో హెచ్ఐవీ పరీక్షలు జరిపారు. ఇందులో 85 మంది ఫలితాలు పాజిటివ్గా వచ్చాయి. ఈ స్థాయిలో వైరస్ సోకడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే హెచ్ఐవీ సోకిన ఖైదీలంతా డ్రగ్స్కు అలవాటుపడినవారేనని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలు తీసుకొనేటపుడు వాడే సిరంజిల కారణంగానే ఈ స్థాయిలో పాజిటివ్ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వైద్యుల నివేదికను కారాగార అధికారులు కూడా ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం