Afghanistan: అదను చూసి నమ్మక ద్రోహం: తాలిబన్లతో చేతులు కలిపిన ఘనీ సన్నిహితుడు!
అమెరికా ఊహించినదాని కంటే వేగంగా అఫ్గాన్ను తాలిబన్లు కైవసం చేసుకోవడం వెనుక
అందుకే అంత వేగంగా కాబుల్ హస్తగతం
దిల్లీ: అమెరికా ఊహించినదాని కంటే వేగంగా అఫ్గాన్ను తాలిబన్లు కైవసం చేసుకోవడం వెనుక ఓ వ్యక్తి నమ్మకద్రోహం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇబ్బందుల్లో పడ్డ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి అత్యంత సన్నిహితుడు మిర్వాయిస్ యాసినీయే ఆ వ్యక్తి అని తెలుస్తోంది. ఆయన తాలిబన్లను తీవ్రంగా విమర్శిస్తూ, ఘనీ వెంటే ఉంటూ చివరకు తాలిబన్లతో చేతులు కలపడంతో వారి దురాక్రమణ వేగం పుంజుకుంది. నిజానికి కాబుల్ అంత తేలిగ్గా తాలిబన్ల వశం కాదన్న తమ గూఢచారి వర్గాల అంచనాలను నమ్మి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేసవి విహారానికీ సిద్ధమయ్యారు. అంతలో అన్ని అంచనాలను తారుమారు చేస్తూ కాబుల్ వేగంగా తాలిబన్ల వశమైంది. వారితో యాసినీ కుమ్మక్కు కావడం చూస్తే, అఫ్గాన్ ప్రభుత్వం, సైన్యంలోని లుకలుకలే ప్రభుత్వ శీఘ్ర పతనానికి మూల కారణమని తేలిపోతోంది. కాబుల్ అతి తేలిగ్గా తాలిబన్ల పరం కావడంతో అమెరికా 3,000 మంది సైనికులను హుటాహుటిన అక్కడికి పంపాల్సి వచ్చింది.
కీలక బాధ్యతల అప్పగింత
అఫ్గాన్ పార్లమెంటు దిగువ సభకు డిప్యూటీ స్పీకర్గా ఉన్న యాసినీ తూర్పు నంగార్హర్ రాష్ట్రానికి ప్రతినిధి. పష్తూన్ తెగకు చెందినవారు. ఇప్పుడు కాబుల్ బాధ్యతను తాలిబన్లు ఆయనకే అప్పగించారు. అఫ్గానిస్థాన్ భద్రత, సుస్థిరతలకు అతిపెద్ద ముప్పు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నుంచి కాదు, తాలిబన్ల నుంచే పొంచి ఉందని నాలుగేళ్ల క్రితం ఆయన చెబుతూ వచ్చేవారు. 16 ఏళ్ల వయసులోనే తుపాకీ పట్టిన ఆయన.. 1986లో ఉన్నత చదువులకు పాకిస్థాన్ వెళ్లారు. ఇస్లామాబాద్లోని ఇస్లామిక్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (ఐఐఐయు)లో ఇస్లామిక్ న్యాయ శాస్త్రం, రాజనీతి శాస్త్రాల్లో పీజీ చేశారు. 1996-2001 మధ్య అఫ్గాన్లో అధికారంలో ఉన్న తాలిబన్లపై పోరాటం జరిపి, వారి పతనం తర్వాత ప్రభుత్వంలో చేరి, 2005 వరకు ఉప మంత్రిగా ఉన్నారు. 2009లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు తాలిబన్లను వ్యతిరేకించిన ఆయన ఏ పరిస్థితుల్లో ఇప్పుడు వారికి వంత పాడారనే విషయంపై స్పష్టత లేదు. తాలిబన్లు మాత్రం ఆయనకు కీలక బాధ్యతలనే అప్పగించారు. రాజధాని కాబుల్ భద్రత వ్యవహారాలు ఆయన చేతిలో పెట్టినట్లు సమాచారం. అఫ్గాన్ అధ్యక్షునిగా హమీద్కర్జాయ్ ఉన్నప్పుడు ఆయనకూ విశ్వాసపాత్రునిగా యాసినీ ఉండేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.