Facebook: భారత్లో ఫేస్బుక్ వేదికగా విద్వేష ప్రచారం
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ వేదికగా భారత్లో బూటకపు సమాచారం విస్తృతంగా ప్రచారంలోకి వస్తోంది! ప్రత్యర్థి వర్గాలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు వార్తల్ని జనంలోకి జొప్పించేందుకు కొన్ని వర్గాలు అనేక
సంస్థ అంతర్గత పరిశోధనలో వెల్లడి
న్యూయార్క్: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ వేదికగా భారత్లో బూటకపు సమాచారం విస్తృతంగా ప్రచారంలోకి వస్తోంది! ప్రత్యర్థి వర్గాలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు వార్తల్ని జనంలోకి జొప్పించేందుకు కొన్ని వర్గాలు అనేక గ్రూపులు, పేజీలను సృష్టిస్తున్నాయి!! స్వయంగా ఫేస్బుక్ అంతర్గతంగా నిర్వహించిన పరిశోధనలో తేలిన అంశాలివి. సంబంధిత వివరాలు అమెరికా మీడియాలో తాజాగా ప్రచురితమయ్యాయి. ఫేస్బుక్కు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మార్కెట్- భారత్. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకుగాను సంస్థ పరిశోధకులు.. 2019 ఫిబ్రవరిలో ఫేస్బుక్లో ఓ సాధారణ వ్యక్తిలా ఖాతాను ప్రారంభించారు. అనంతరం అందులో ఆటోమేటిక్గా వచ్చిన సూచనల మేరకు ఆయా గ్రూపుల్లో చేరారు. పలు వీడియోలు చూశారు. వివిధ పేజీలను సందర్శించారు. సంబంధిత వివరాలన్నింటినీ పరిశీలించి ఓ నివేదికను రూపొందించారు. అందులోని సమాచారం ప్రకారం.. భారత్లో నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాలకు ఫేస్బుక్ వేదికగా నిలుస్తోంది. హింస చోటుచేసుకున్నప్పుడు ఈ వేదికపై కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకునేందుకు పలు గ్రూపులు, ఖాతాలను ఉపయోగించుకుంటున్నాయి. ఓ సంస్థకు చెందిన పోస్టులన్నీ మతపరమైన ఓ వర్గానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత