UN Human Rights Council: మీ నీతులు మాకొద్దు మీది విఫల దేశం
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ను భారత్ మరోసారి విమర్శలతో చీల్చిచెండాడింది. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తినందుకుగాను
హక్కులను కాలరాస్తున్నారు
ఐరాస మానవహక్కుల మండలిలో పాక్ను దునుమాడిన భారత్
దిల్లీ: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ను భారత్ మరోసారి విమర్శలతో చీల్చిచెండాడింది. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తినందుకుగాను పదునైన మాటలతో గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ను విఫల దేశంగా అభివర్ణించింది. ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంటూ.. రోజూ మానవ హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాసే ఆ దేశం నుంచి నీతులు వినాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పింది. కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించినందుకుగాను ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)పైనా మండిపడింది. ఐరాస మానవహక్కుల మండలి 48వ సమావేశంలో పాక్, ఓఐసీ తాజాగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాయి. దీంతో జెనీవాలోని భారత శాశ్వత మిషన్లో ఫస్ట్ సెక్రటరీగా ఉన్న పవన్ బఢే బుధవారం దీటుగా స్పందించారు. మానవ హక్కుల మండలి ఏర్పాటుచేసే వేదికల్లో భారత్పై దుష్ప్రచారానికి తెగబడటం పాక్కు అలవాటేనని పేర్కొన్నారు. ‘‘పాక్ ప్రభుత్వం తమ అధీనంలోని భూభాగాల్లో మానవ హక్కులను దారుణంగా హరిస్తోంది. దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఐరాస మానవ హక్కుల మండలికి తెలుసు. భారత్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అంతేకాదు హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటుంది. ఉగ్రవాద కేంద్రంగా ఉన్న, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న పాక్ వంటి విఫల దేశం నుంచి మాకు పాఠాలు అక్కర్లేదు. సిక్కులు, హిందువులు, క్రైస్తవులు, అహ్మదీయులు సహా మైనారిటీలందరి హక్కులను పరిరక్షించడంలో పాక్ విఫలమైంది. పాక్లో, ఆ దేశం ఆక్రమించిన ఇతర భూభాగాల్లో వేల మంది మైనారిటీ మహిళలు, బాలికలు అపహరణలకు గురయ్యారు. బలవంతపు పెళ్లిళ్లు, మతమార్పిడుల బాధితులుగా మారారు. మతపరమైన మైనారిటీ వర్గాలపై పాక్ ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతోంది. ఆ దేశం ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతు పలుకుతోందని, వారికి శిక్షణనిస్తోందని, ఆయుధాలు-నిధులు సమకూరుస్తోందని ప్రపంచమంతటికీ తెలుసు. ఐరాస నిషేధిత జాబితాలోని ముష్కరులకూ పాక్ అండగా నిలుస్తోంది. అది వారి జాతీయ విధానం. పౌర సమాజ ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయుల అసమ్మతి గళాన్ని పాకిస్థాన్లో ప్రతిరోజు అణచివేస్తున్నారు’’ అని పవన్ పేర్కొన్నారు. భారత అంతర్గత వ్యవహారమైన కశ్మీర్ విషయంపై మాట్లాడేందుకు ఓఐసీకి ఎలాంటి హక్కూ లేదని ఆయన చెప్పారు. ఆ సంస్థ నిస్సహాయ స్థితిలో పాక్ చేతిలో బందీగా మారిందని ఎద్దేవా చేశారు.
భారత్లో ఆశ్రయం కోసం కొత్తగా 736 మంది అఫ్గానీల దరఖాస్తు
భారత్లో ఆశ్రయం కోసం గత నెల 1 నుంచి ఈ నెల 11 వరకు దిల్లీలో తమకు కొత్తగా 736 మంది అఫ్గానీల నుంచి దరఖాస్తులు అందాయని ఐరాస శరణార్థుల హైకమిషనర్ (యూఎన్హెచ్సీఆర్) కార్యాలయం వెల్లడించింది. అఫ్గానిస్థాన్ జాతీయులకు వీసా గడువును పొడిగించడం, వారికి ఇతర రూపాల్లో అండగా నిలవడం వంటి అంశాలపై భారత ప్రభుత్వంతో తాము ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.