North Korea: చక్రం తిప్పనున్న కిమ్ సోదరి
అమెరికా నుంచి తనకు కావలసింది సాధించుకోవాలంటే దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచాలనీ, దాంతో అమెరికా దిగివస్తుందని
ప్రభుత్వ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా నియామకం
ప్యాంగ్యాంగ్: అమెరికా నుంచి తనకు కావలసింది సాధించుకోవాలంటే దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచాలనీ, దాంతో అమెరికా దిగివస్తుందని ఉత్తర కొరియా మొదట నుంచీ లెక్కవేసుకుంటోంది. ఈసారి ఆ పనిని సమర్థంగా చేయడానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జోంగ్ను రంగంలోకి దింపారు. యో జోంగ్ను కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా నియమించడంతో.. సోదరుడి తరఫున విదేశాంగ వ్యవహారాలను చక్కబెట్టే పనిని ఆమెకు అప్పగించినట్లు స్పష్టమైంది. యో జోంగ్ సామాన్యురాలు కాదు. ఒకవైపు శాంతి ప్రతిపాదనలు చేస్తూనే, రెండోవైపు ఆయుధ బలాన్ని ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అణ్వాయుధాలపై చర్చలు ప్రతిష్టంభించిన సమయంలోనే యో జోంగ్ తమ గడ్డపై దక్షిణ కొరియా నిర్మించిన సమన్వయ కార్యాలయాన్ని జూన్లో ధ్వంసం చేయించారు. ఉత్తర కొరియాతో బేషరతుగా చర్చలు జరపడానికి అమెరికా సిద్ధంగా ఉందని జో బైడెన్ ప్రకటించగా, యో జోంగ్ అందుకు మెలికలు పెట్టారు. తమ దేశంపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసి, దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలకు స్వస్తి చెబితేనే చర్చలకు ఒప్పుకొంటామని యో జోంగ్ తెగేసి చెప్పారు.
తరవాత దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఆరు నెలల తరవాత మొదటిసారిగా క్షిపణి పరీక్షలు నిర్వహించారు. ఆపై తన సోదరుడు కిమ్ అధ్యక్షతలోని ప్రభుత్వ వ్యవహారాల కమిటీలో సభ్యురాలిగా యో జోంగ్కు పదోన్నతి లభించింది. 30వ పడిలో ఉన్న యో జోంగ్ను ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిమ్ తరవాత అత్యంత శక్తిమంతమైన నేతగా పరిగణించవచ్చని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ పేర్కొన్నది. ఇక నుంచి అమెరికా, దక్షిణ కొరియాలతో జరిగే చర్చల్లో యో జోంగ్ ఉత్తర కొరియా అధికార ప్రతినిధిగా పాల్గొంటారని నిపుణుల అంచనా. బహుశా ఆమెను అమెరికాలో తమ ప్రత్యేక దూతగా కిమ్ నియమించినా ఆశ్చర్యం లేదు.
మరోవైపు, ఉత్తర కొరియా అణ్వస్త్రాలను విడనాడటానికి ముందుకు రానంతవరకు ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను సడలించేది లేదని బైడెన్ విస్పష్టంగా ప్రకటించారు. కానీ, ఉత్తర కొరియా ధిక్కారపూరితంగా సెప్టెంబరు 11 నుంచి అణ్వస్త్ర వాహక సామర్థ్యమున్న క్రూయిజ్ క్షిపణినీ, కదిలే రైలు మీద నుంచి లేచే క్షిపణినీ పరీక్షించింది. ఒక హైపర్ సోనిక్ క్షిపణిని రూపొందించే పనిలో నిమగ్నమైంది. దక్షిణ కొరియాకు అమెరికా అందించిన ఆధునిక ఫైటర్ విమానాలను కూల్చేయగల క్షిపణులనూ పరీక్షించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు