దేశీయ విమానాలపై ఆంక్షల ఎత్తివేత.. పూర్తిస్థాయి సీటింగ్కు కేంద్రం అనుమతి
దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో సీటింగ్ పరిమితిపై ఇప్పటి వరకూ విధించిన ఆంక్షలు తొలగించింది. అక్టోబరు 18 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
దిల్లీ: దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో సీటింగ్ పరిమితిపై ఇప్పటి వరకూ విధించిన ఆంక్షలు తొలగించింది. అక్టోబరు 18 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. గతేడాది లాక్డౌన్ సమయంలో దేశీయ విమానాలపై కేంద్రం పూర్తి నిషేధం విధించింది. ఆ తర్వాత 2020 మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలు నడిపేందుకు అనుమతిచ్చింది. డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. రెండో విడత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 1న ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించింది. అనంతరం ఆగస్టు 12 నాటికి ఆక్యుపెన్సీని 72.5 శాతానికి పెంచింది. సెప్టెంబర్లో 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలను నడుపుకొనేందుకు విమానయాన సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొవిడ్ కేసులు కనిష్ఠ స్థాయికి చేరుతున్న క్రమంలో.. సీటింగ్పై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎంపీల ప్రొటోకాల్ను కొనసాగించండి
దేశంలోని విమానాశ్రయాలు, విమానాల్లో పార్లమెంటు సభ్యులకు కల్పిస్తున్న ప్రత్యేక వసతులను కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వశాఖ సూచించింది. కొన్ని ఎయిర్లైన్స్, విమానాశ్రయాలు ప్రొటోకాల్ నిబంధనలను పాటించడంలేదనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?