Jammu and Kashmir: తూటాల నేలలో అభివృద్ధికి బాట.. జమ్మూకశ్మీర్లో కొత్త సొబగులు
ఏదైనా కాల్సెంటర్ నుంచి మీకు ఫోన్ వస్తే అది ఇక బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి ఐటీ హబ్ల నుంచి వచ్చింది
పెట్టుబడులతో పారిశ్రామికవేత్తల క్యూ
మార్చి నాటికి రూ.50 వేల కోట్లు ఆకర్షించేందుకు అవకాశం
దిల్లీ: ఏదైనా కాల్సెంటర్ నుంచి మీకు ఫోన్ వస్తే అది ఇక బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి ఐటీ హబ్ల నుంచి వచ్చింది అయి ఉండకపోవచ్చు. జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదానికి అడ్డాలుగా ఉన్న బందిపొర, కుప్వారా వంటి పట్టణాల నుంచి రావొచ్చు. గత కాలపు రక్తపు మరకలు చెరిపేసుకొని.. అభివృద్ధి, వాణిజ్యంలో ఈ ప్రాంతాలు ఇప్పుడు ముందడుగు వేస్తున్నాయి. కొత్త పారిశ్రామిక విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తూ నయా సొబగులను సంతరించుకుంటున్నాయి. కొంతకాలం కిందటి వరకూ అక్కడ బందూకులు రాజ్యమేలాయి. ముష్కర దాడులు, ఎన్కౌంటర్ వార్తల్లో ఆ పట్టణాల పేర్లు మార్మోగేవి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. క్రమంగా ఎదురుకాల్పులు, ఉగ్రవాద దాడులు అనే మాటల స్థానంలో వాణిజ్యం, ప్రాజెక్టులు, టర్నోవర్లు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది నాలుగు నెలల కిందట తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం (ఎన్ఐపీ) ఫలితమే. దీనివల్ల ఇప్పటివరకూ రూ.23వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో జమ్మూకు రూ.12వేల కోట్లు, కశ్మీర్కు రూ.11వేల కోట్లు దక్కాయి. ‘‘ఇది ప్రారంభం మాత్రమే. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి రూ.50వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం’’ అని జమ్మూ-కశ్మీర్ అధికార వర్గాలు తెలిపాయి.
కాల్ సెంటర్ల జోరు..
జమ్మూ-కశ్మీర్లోని ప్రతి జిల్లాలోనూ కాల్సెంటర్లు ఏర్పాటు చేసే కసరత్తు సాగుతోంది. ‘‘ఇక్కడ ఐటీకి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాం. నిజానికి అనేక పెద్ద కంపెనీలు దీనిపై ఆసక్తి చూపడం వల్లే మేం ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. బారాముల్లా, జమ్ములో యువత కోసం ఇప్పటికే హైటెక్ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్కడ.. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి అధునాతన అంశాలపై శిక్షణ ఇస్తున్నాం’’ అని జమ్మూ-కశ్మీర్ పాలన యంత్రాంగంలోని ఓ కీలక అధికారి తెలిపారు.
పెట్టుబడిదారుల నుంచి నిత్యం 3-4 ప్రతిపాదనలు వస్తున్నాయని అధికారులు చెప్పారు. వీటి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కొన్నింటిని తోసిపుచ్చాల్సి వస్తోందని తెలిపారు. ‘‘దేశీయ పెట్టుబడిదారుల నుంచే ఎక్కువ ప్రతిపాదనలు వస్తున్నాయి. వాటిలో అధిక భాగం ముంబయి వ్యాపారవేత్తల నుంచి అందుతున్నాయి. విదేశాల నుంచి.. ముఖ్యంగా ఐరోపా పెట్టుబడిదారుల నుంచి కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా వ్యవసాయం, హార్టికల్చర్ రంగాలపై పెట్టుబడిదారులు దృష్టి పెడుతున్నారు. ఇక్కడి ప్రత్యేక వాతావరణం, భౌగోళిక పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తదుపరి విడత పెట్టుబడుల ఆకర్షణ కసరత్తులో దీనిపై ఎక్కువగా దృష్టి పెడతాం. ఎక్కువ మంది వ్యాపారవేత్తలు పండ్ల పరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆపిళ్లు, ఆప్రికాట్, ప్లమ్, చెర్రీ, బాదం తదితరాలపై దృష్టి ఎక్కువగా ఉంటోంది. ఇందుకు అనుగుణంగా భారీగా పండ్ల తోటల పెంపకం కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రంగంలో ప్రయోగాలు, పరిశోధనలూ పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి’’ అని అధికార వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM