Infosys: ఇన్ఫోసిస్పై విరుచుకుపడిన ఆరెస్సెస్ పత్రిక
ఇన్ఫోసిస్ కంపెనీ రూపొందించిన ఐటీ, జీఎస్టీ పోర్టల్స్లో పలు లోపాలు తలెత్తడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ వారపత్రిక ‘పాంచజన్య’ తీవ్రమైన దాడికి దిగింది. ఈ లోపాల ఆధారంగా జాతివ్యతిరేక శక్తులు భారత...
దిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ రూపొందించిన ఐటీ, జీఎస్టీ పోర్టల్స్లో పలు లోపాలు తలెత్తడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ వారపత్రిక ‘పాంచజన్య’ తీవ్రమైన దాడికి దిగింది. ఈ లోపాల ఆధారంగా జాతివ్యతిరేక శక్తులు భారత ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తీస్తే ఎలాగంటూ నిలదీసింది. మార్కెట్లోకి వచ్చిన ఈ పత్రిక తాజా సంచికలో ‘సాఖ్ ఔర్ ఆఘాత్’ (ఘనకీర్తి.. అప్రదిష్ఠ) శీర్షికతో ఇన్ఫోసిస్పై నాలుగు పేజీల ముఖచిత్ర కథనం ఇచ్చారు. సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చిత్రాన్ని కవర్పేజీపై ముద్రించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఇన్ఫోసిస్పై ‘ఊంచీ దుకాన్, ఫీకా పక్వాన్’ (పేరు గొప్ప, ఊరు దిబ్బ) అంటూ పత్రిక విరుచుకుపడింది. ఇన్ఫోసిస్ చేసే ఇటువంటి నిర్వాకాలతో పలు సందర్భాల్లో నక్సలైట్లు, లెఫ్టిస్టులు, కొన్ని గ్యాంగులు లబ్ధి పొందాయంటూ కథనంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు తమ వద్ద బలమైన ఆధారాలు లేవని కూడా స్పష్టం చేశారు. ‘తన విదేశీ ఖాతాదారులకు కూడా ఈ సంస్థ ఇలాంటి నిరర్థక సేవలే అందిస్తుందా?’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?