Ethanol: ఇథనాల్ వినియోగానికి ప్రాధాన్యం
పర్యావరణ అనుకూల ఇథనాల్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పెట్రోలులో ఇథనాల్ మిశ్రమాన్ని 2025 నాటికల్లా 20
పెట్రోలులో దీని మిశ్రమాన్ని 20 శాతం పెంపునకు కేంద్రం నిర్ణయం
ఆర్థిక లాభం కంటే పర్యావరణ ప్రయోజనాలే అధికం
ఈనాడు, దిల్లీ: పర్యావరణ అనుకూల ఇథనాల్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పెట్రోలులో ఇథనాల్ మిశ్రమాన్ని 2025 నాటికల్లా 20 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. ప్రస్తుతం 332 కోట్ల లీటర్ల ఇథనాల్ను పెట్రోలులో కలుపుతుండగా, దాన్ని 2025-26 నాటికి 1,016 కోట్ల లీటర్లకు తీసుకెళ్లాలని సర్కారు లక్ష్యం పెట్టుకొంది. దీన్ని చేరుకోవాలంటే ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 426 కోట్ల లీటర్ల నుంచి 1,500 కోట్ల లీటర్లకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందులో ఆహార గింజల ద్వారా 740 కోట్ల లీటర్లు, చెరకు ఆధారంగా మరో 760 కోట్ల లీటర్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని నీతి ఆయోగ్ ఇప్పటికే అంచనా వేసింది.
1.5% నుంచి మొదలై...
2014లో సగటున 1.5% మేర ఇథనాల్ను పెట్రోలులో కలుపుతుండగా, ఇప్పుడు అది 8.5 శాతానికి చేరింది. 2022 నాటికి దీన్ని 10 శాతానికి, 2025 నాటికి 20 శాతానికి పెంచాలన్నది తాజా లక్ష్యం.ఇప్పటివరకూ చెరకు అధికంగా పండే నాలుగైదు రాష్ట్రాల్లోనే ఇథనాల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ముక్కిపోయిన ఆహార గింజలతో దీన్ని ఉత్పత్తిచేసే ఇస్టిలరీస్ను దేశవ్యాప్తంగా నెలకొల్పాలని ప్రభుత్వం యోచించింది. ఈ క్రమంలోనే తాజాగా ఇథనాల్ ధరలను పెంచింది. షుగర్జ్యూస్, సిరప్ల నుంచి లీటరు ఇథనాల్ తయారీకి రూ.62.55, బి-హెవీకి రూ.57.61, సి-హెవీకి రూ.45.69; వ్యర్థ ఆహారగింజల నుంచి దీన్ని ఉత్పత్తి చేయడానికి రూ.51.55, మిగులు బియ్యం నుంచి తయారీకి రూ.56.87 ఖర్చవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. పంట ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నందున దేశంలో ఇథనాల్ ధర మిగిలిన దేశాల కంటే అధికంగానే ఉంటోంది. ఇదే సమయంలో పన్నులు లేకుండా లీటరు పెట్రోలు రూ.42, డీజిల్ రూ.43కి లభిస్తోంది. వీటితో పోలిస్తే ఇథనాల్ ధర ఎక్కువే. ఇథనాల్ మీద జీఎస్టీ అమలు చేస్తున్నందున లీటరుపై రూ.2.28 నుంచి రూ.3.13 వరకు పన్ను వర్తిస్తుంది. ఇదే సమయంలో పెట్రోలు మీద లీటరుకు ఎక్సైజ్ డ్యూటీ రూ.27.98 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పెట్రోలులో 332 కోట్ల లీటర్ల ఇథనాల్ను కలపడం వల్ల ఆ మేరకు పెట్రోలియం వాడకం తగ్గుతోంది. ఫలితంగా ప్రభుత్వం ఏటా రూ.9,289 కోట్ల మేర ఎక్సైజ్డ్యూటీ కోల్పోవాల్సి వస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇవీ ప్రయోజనాలు...
• ఇథనాల్ మూలకాల్లో ఉండే ఆక్సిజన్.. పెట్రోలును పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ఇంజిన్కు దోహదపడుతుంది. ఫలితంగా కర్బన ఉద్గారాలు, కాలుష్యం తగ్గుతాయి.
• 20% ఇథనాల్ మిశ్రమాన్ని పెట్రోలులో కలిపితే నాలుగు చక్రాల వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ 30%, హైడ్రోకార్బన్స్ 20% తగ్గుతాయని అంచనా.
•ఇథనాల్ ఉత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది.
• పెట్రోలులో 20% ఇథనాల్ను కలపడం వల్ల ఏటా రూ.30 వేల కోట్ల విలువైన ముడిచమురు దిగుమతులు తగ్గుతాయి.
• ఇథనాల్ వినియోగం వల్ల ఆర్థిక ప్రయోజనాల కంటే పర్యావరణపరంగా కలిగే మేలే అధికం.
ఇంజిన్ భారం వినియోగదారులపైనే
దేశంలో ప్రస్తుత వాహన ఇంజిన్లు 5% ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడటానికే సరిపోతాయి. అంతకుమించితే, వాహనాల మైలేజీ తగ్గిపోతుంది. లేదంటే, ఇథనాల్ మిశ్రమం అధికంగా ఉండే ఇంధనాన్ని వినియోగించుకునేలా ఇంజిన్లను మార్చుకోవాలి. ఇలాంటి ‘ఫ్లెక్స్-ఫ్యూయల్-ఇంజిన్’ ఉండే నాలుగు చక్రాల వాహనాల ధర రూ.17వేలు-రూ.25 వేల వరకూ, ద్విచక్ర వాహనాల ధర రూ.5వేలు-రూ.12 వేల వరకూ అధికంగా ఉంటున్నాయి. ఈ భారాన్ని వినియోగదారుడే భరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ