cooking oil: వంట నూనెల ధరల్లో ఊరట.. దిగుమతి సుంకాల తగ్గింపు
పండగల సీజన్లో వంట నూనెల ధరలు పెరగకుండా కట్టడి చేసేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ...
దిల్లీ: పండగల సీజన్లో వంట నూనెల ధరలు పెరగకుండా కట్టడి చేసేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం ముడి పామాయిల్పై దిగుమతి సుంకం ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 2.5శాతానికి, ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. దీంతో దిగుమతి సుంకం సహా అన్ని రకాల పన్నులు కలిపి ఈ మూడు రకాల ముడి నూనెలపై 24.75శాతానికి, రిఫైన్డ్ ఆయిల్ రకాలపై 35.75 శాతానికి పరిమితం కానున్నాయి. వినియోగదారుల వద్దకు వచ్చే సరికి ఒక్కో లీటరు నూనె ధర రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వం దాదాపు రూ.1100 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని ఆర్థిక శాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్