Lottery ticket: రూ.290 కోట్ల లాటరీ టికెట్‌ వారం పాటు బ్యాగులోనే!

జర్మనీకి చెందిన మహిళకు కలలో కూడా ఊహించని జాక్‌పాట్‌ తగిలింది

Published : 29 Jul 2021 14:55 IST

బెర్లిన్‌: జర్మనీకి చెందిన మహిళకు కలలో కూడా ఊహించని జాక్‌పాట్‌ తగిలింది. లాటరీలో 39 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.290 కోట్లు) గెలుచుకుంది. ఈ విషయం తెలియని ఆమె వారం పాటు ఆ టికెట్‌ను తన బ్యాగులోనే ఉంచుకుంది. చివరకు లాటరీ మొత్తాన్ని తీసుకుని ఆనందానికి లోనైంది. జర్మనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ‘‘45 ఏళ్ల ఓ మహిళ కొనుగోలు చేసిన టికెట్‌ రూ. 290 కోట్లు గెల్చుకుంది. డ్రాలో ఆమె ఒక్కరే విజేతగా నిలిచారు. ఇది తెలియని ఆమె వారం పాటు ఆ టికెట్‌ను తన బ్యాగులోనే ఉంచుకున్నారు’’ అని లాటరీ టికెట్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఆ మహిళ పేరును వెల్లడించలేదు. మొత్తంమీద ఆలస్యంగానైనా ఆ మహిళ డబ్బు తీసుకుంది. విషయం తెలియక.. ఆ టికెట్‌ను తన బ్యాగ్‌లో ఉంచుకుని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆ మహిళ తెలిపారు.  గెల్చుకున్న మొత్తం తన కుటుంబం ఆరోగ్యకర జీవితాన్ని గడిపేందుకు సరిపోతుందని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని