Aadhaar: ఆధార్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.కోటి జరిమానా
ఆధార్ వినియోగంలో ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవస్థను నిర్వహిస్తున్న ఆధార్ ప్రాధికార సంస్థ-ఉడాయ్(యూఐడీఏఐ)కు చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే...
ఉడాయ్కి చర్యలు తీసుకునే అధికారం
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
దిల్లీ: ఆధార్ వినియోగంలో ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవస్థను నిర్వహిస్తున్న ఆధార్ ప్రాధికార సంస్థ-ఉడాయ్(యూఐడీఏఐ)కు చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన అధికారంతో ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను ఉడాయ్ పరిశీలించి గరిష్ఠంగా రూ.కోటి వరకు జరిమానా విధించవచ్చు. ఫిర్యాదుల పరిశీలనకు న్యాయాధికారులను నియమించుకునే అధికారం ఆ సంస్థకు ఉంటుంది. న్యాయాధికారులు విధించిన జరిమానాలపై అప్పీలు చేసుకోవాలంటే టెలికాం వివాదాల పరిష్కారాల ట్రైబ్యునల్ అప్పీలేట్ అథారిటీగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. దీనికి సంబంధించిన చట్టాన్ని రెండేళ్ల క్రితమే ఆమోదించగా తాజాగా అందుకు వీలు కల్పించే నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్