Prison: చేయని నేరానికి జైల్లోనే 43 ఏళ్లు
చేయని నేరానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 43 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు అమెరికాలోని మిసోరికి చెందిన కెవిన్ స్ట్రిక్లాండ్. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈనెల 23న నిర్దోషిగా తేలుస్తూ కోర్టు అతడిని జైలు నుంచి విడుదల చేసింది.
62 ఏళ్ల వయసులో ఎట్టకేలకు నిర్దోషిగా విడుదల
వాషింగ్టన్: చేయని నేరానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 43 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు అమెరికాలోని మిసోరికి చెందిన కెవిన్ స్ట్రిక్లాండ్. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈనెల 23న నిర్దోషిగా తేలుస్తూ కోర్టు అతడిని జైలు నుంచి విడుదల చేసింది. దీంతో 18 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిన కెవిన్ 62 ఏళ్ల వృద్ధుడిగా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కెవిన్కు ఆర్థిక సాయం అందించేందుకు ‘గో ఫండ్ మీ’ సంస్థ రూ. 10 కోట్లు విరాళంగా సేకరించింది. 1978 ఏప్రిల్ 25న కాన్సాస్ నగరంలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ముగ్గురిని కాల్చి చంపారు. ఘటన నుంచి తప్పించుకున్న సింతియా డగ్లస్ అనే మహిళ.. కాల్పులు జరిపిన వారిలో కెవిన్ ఉన్నాడని భావించి అతని పేరును పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత తాను పొరబడినట్లు డగ్లస్ తెలుసుకున్నా.. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమోనన్న భయంతో పెదవి విప్పలేదు. డగ్లస్ సాక్ష్యాన్ని పరిగణించి కెవిన్కు కోర్టు 50 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. దశాబ్దాలు గడిచాక ఈ ఏడాది ఆగస్టులో కెవిన్ శిక్షను సవాల్ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో కెవిన్ నిర్దోషి అని కోర్టు తేల్చింది. ఈ నెల 23న కెవిన్ జైలు నుంచి విడుదలయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్