Gambling: జూదంలో భార్యను ఓడి.. ట్రిపుల్‌ తలాక్‌తో గెంటేసి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను దిల్లీకి తీసుకెళ్లిన ఓ వ్యక్తి జూదంలో ఆమెను తాకట్టుపెట్టి ఓడిపోయాడు.

Published : 02 Dec 2021 09:37 IST

 

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను దిల్లీకి తీసుకెళ్లిన ఓ వ్యక్తి జూదంలో ఆమెను తాకట్టుపెట్టి ఓడిపోయాడు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ తన స్వస్థలమైన బలియా జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో రూ. 2 లక్షలు ఇవ్వాలని భర్త వేధించాడని.. కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. డబ్బులు ఇవ్వనందుకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని