Crime News: ఒక్కడే 75 మందిని పెళ్లాడి.. 200 మందిని వ్యభిచారంలోకి దించి..
బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్లోకి అక్రమంగా రవాణా చేయడంతోపాటు, ఏకంగా 75 మందిని వివాహం చేసుకున్న నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
ఘరానా మోసగాడిని అరెస్టుచేసిన పోలీసులు
బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్లోకి అక్రమంగా రవాణా చేయడంతోపాటు, ఏకంగా 75 మందిని వివాహం చేసుకున్న నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార కూపం నుంచి 21 మంది యువతులను రక్షించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మునిర్ గుజరాత్లోని సూరత్లో పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్లోని జాసుర్కు చెందిన మునిర్ అలియాస్ మునిరుల్.. ఆ దేశానికి చెందిన యువతులను ఉపాధి నెపంతో భారత్లోకి అక్రమ రవాణా చేసేవాడు. పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ మీదుగా ఈ అక్రమ రవాణా వ్యవహారం సాగేది. ఈ క్రమంలో సరిహద్దులోని అధికారులకు మునిర్ రూ.25వేల చొప్పున లంచం ఇచ్చేవాడు. అనంతరం బంగ్లాదేశ్ యువతులను ముంబయి, కోల్కతా ప్రధాన కేంద్రాలుగా మునిర్ వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు. ఇలా 200 మంది యువతులను భారత్లోకి అక్రమ రవాణా చేసినట్లు చెప్పారు. మరోవైపు, తాను ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నట్లు మునిర్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.