Omicron scare: బూస్టర్లు ఇవ్వండి.. డోసుల మధ్య వ్యవధి తగ్గించండి..!
కరోనా కొత్త రకం ఒమిక్రాన్ ఆందోళనల మధ్య.. బూస్టర్ డోసుకు అనుమతి ఇవ్వాలని, రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్రానికి లేఖ రాశారు. టీకా తీసుకునేందుకు కనీస వయస్సును 15 సంవత్సరాలకు కుదించాలని సూచించారు. ట్విటర్ ఖాతా పోస్టు ద్వారా లేఖ రాసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు.
కేంద్రానికి రాసిన లేఖలో కోరిన మహారాష్ట్ర మంత్రి
ముంబయి: కరోనా కొత్త రకం ఒమిక్రాన్ ఆందోళనల మధ్య.. బూస్టర్ డోసుకు అనుమతి ఇవ్వాలని, రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్రానికి లేఖ రాశారు. టీకా తీసుకునేందుకు కనీస వయస్సును 15 సంవత్సరాలకు కుదించాలని సూచించారు. ట్విటర్ ఖాతా పోస్టు ద్వారా లేఖ రాసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు.
‘కొవిడ్ టీకా గురించి నేను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాజీకి లేఖ రాశాను. వైద్యులు, కొవిడ్ పరిస్థితుల్నినిశితంగా గమనిస్తోన్న నిపుణులతో చర్చించిన మీదట కొన్ని సూచనలు చేశాను. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో మనం దేశ పౌరుల్ని రక్షించుకోవచ్చు ఇందు కోసం మూడు సూచనలు అంటూ ఆ లేఖను షేర్ చేశారు. టీకా కార్యక్రమం ప్రారంభమైన కొత్తల్లో ఫ్రంట్లైన్ వర్కర్స్, వైద్య సిబ్బందికి మొదట టీకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి బూస్టర్లు వేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. టీకా తీసుకునేందుకు కనీస వయస్సును 15 సంవత్సరాలకు కుదించాలని సూచించారు. దాంతో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు టీకా రక్షణ లభిస్తుందన్నారు. రెండు డోసుల మధ్య వ్యవధిని నాలుగు వారాలకు కుదించాలని పేర్కొన్నారు. దాని వల్ల టీకా పంపిణీ వేగవంతం అవుతుందని వెల్లడించారు. కరోనా మొదటి, రెండోదశల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసింది. ఈ రకం కేసులు దేశంలో ఇప్పటివరకు 23 బయటపడ్డాయి. మహారాష్ట్రలో 10 మందిలో దీన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదిత్య కేంద్రానికి లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.