Afghan Crisis: ‘మిస్సింగ్ బేబీ’ సోహైల్ ఎక్కడున్నాడో..?
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో వెలుగుచూసిన కల్లోల పరిస్థితులు ప్రపంచ దేశాల్ని కలవరపర్చాయి. తాలిబన్ల భయంతో అక్కడి విదేశీయులు, అఫ్గాన్ వాసులు దేశం దాటేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో హృదయ విదారక దృశ్యాలను మిగిల్చాయి.
కాబుల్: అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో వెలుగుచూసిన కల్లోల పరిస్థితులు ప్రపంచ దేశాల్ని కలవరపర్చాయి. తాలిబన్ల భయంతో అక్కడి విదేశీయులు, అఫ్గాన్ వాసులు దేశం దాటేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో హృదయ విదారక దృశ్యాలను మిగిల్చాయి. ఆ సమయంలో తమకు దూరమైన నెలల కొడుకు కోసం ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విమానాశ్రయ కంచెల మీదుగా వేరుపడిన బిడ్డ జాడ వెతికి పెట్టమని అధికారుల్ని వేడుకుంటున్నారు.
ఆగస్టులో అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ వెంటనే దేశం విడిచిపారిపోయేందుకు విమానాశ్రయం బాటపట్టారు. వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా తాలిబన్లు ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. అయినా వారు ఆగలేదు. ఆ సమయంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేశం దాటించేందుకు కంచెల మీద నుంచి లోపలికి విసిరేసిన దృశ్యాలు వెలుగులోకివచ్చిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితే మీర్జా అలీ అహ్మదీ, ఆయన భార్య సురయాది కూడా. వారు కూడా తమ ఐదుగురు పిల్లలతో విమానాశ్రయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా కుదరలేదు. అక్కడి గుంపులో తమ రెండు నెలల బాబు సోహైల్ ఇబ్బంది పడతాడని తీవ్ర ఆవేదన చెందారు.
సరిగ్గా అప్పుడే అటువైపుగా ఉన్న అమెరికా సైనికుడు ఒకరు సహాయం కావాలా అని అడగడంతో.. వారు తమ బాబును కంచె మీద నుంచి పైకి అందించారు. అక్కడి నుంచి లోపలికి వెళ్లడానికి ఐదు మీటర్ల దూరమే ఉండటంతో వారు ధైర్యం చేసి తమ బాబును ఇచ్చారు. తాము వెంటనే అక్కడికి వెళ్లిపోతామని భావించారు. అయితే తాలిబన్ల భయంతో అక్కడికి చేరుకునే వారి సంఖ్య పెరగడంతో.. వారు లోపలికి వెళ్లేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. ఎలాగోలా లోపలికి వెళ్లి చూసేసరికి వారికి సోహైల్ ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఆ పరిసరాల్లో బిడ్డ ఆనవాలే దొరకలేదు. మిగిలిన బిడ్డలనైనా దక్కించుకోవాలని చివరకు ఇతరులతో కలిసి శరణార్థులుగా అమెరికా విమానంలో టెక్సాస్కు చేరుకున్నారు. ఈ ఘటన జరిగిన తేదీ ఆగస్టు 19. అప్పటి నుంచి తన బిడ్డ కోసం మీర్జా అలీ ఎంతోమంది వద్దకు వెళ్లారు. ఎందరో అధికారుల్ని కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
చివరకు మీర్జా అలీ సహచరులు సోహైల్ ఫొటోతో ‘మిస్సింగ్ బేబీ’ అని ఒక పోస్టర్ను తయారు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కాగా, దీనిపై యూఎస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సొహైల్ గురించి అన్ని ఏజెన్సీలకు సమాచారమందించామన్నారు. బాబు జాడ కోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకున్నట్లు చెప్పారు. తన బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నడో తెలీక సురయా కంటనీరు ఆగడం లేదు. ‘నా ఆలోచనలన్నీ నా బిడ్డ గురించే. అందరూ నన్ను ఓదార్చుతున్నారు. దేవుడు గొప్పవాడు. నీ బిడ్డ దొరుకుతాడని చెప్తున్నారు’ అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది. మీర్జా అలీ 10 సంవత్సరాల పాటు అఫ్గాన్లోని యూఎస్ ఎంబసీలో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్