Afghan women: మళ్లీ పారిపోతున్నాం.. మా వెంట ఉంది నిర్జీవమైన ఆత్మనే!
తాలిబన్ల రాకతో అఫ్గానిస్థాన్ మహిళలు వణికిపోతున్నారు. మళ్లీ తమ బతుకుల్లో చీకట్లు కమ్ముకున్నట్లేనని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు.. ఇక్కడ బతకలేం అంటూ దేశం దాటుతున్నారు. అఫ్గాన్ ఫిల్మ్మేకర్, ఫొటోగ్రాఫర్ రొయా హైదరీ పరిస్థితి కూడా అదే. దేశం విడిచి వెళ్తూ.. ఆమె పెట్టిన విదారక పోస్టు అఫ్గాన్ మహిళల మనోవేదనను ప్రతిబింబిస్తోంది.
కాబుల్: తాలిబన్ల రాకతో అఫ్గానిస్థాన్ మహిళలు వణికిపోతున్నారు. మళ్లీ తమ బతుకుల్లో చీకట్లు కమ్ముకున్నట్లేనని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు.. ఇక్కడ బతకలేం అంటూ దేశం దాటుతున్నారు. అఫ్గాన్ ఫిల్మ్మేకర్, ఫొటోగ్రాఫర్ రొయా హైదరీ పరిస్థితి కూడా అదే. దేశం విడిచి వెళ్తూ.. ఆమె పెట్టిన విదారక పోస్టు అఫ్గాన్ మహిళల మనోవేదనను ప్రతిబింబిస్తోంది.
‘బతుకుపోరాటం కోసం నా ఇంటిని, నా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్తున్నా. మరోసారి.. నేను పుట్టినగడ్డను విడిచి పారిపోతున్నాను. మరోసారి.. సున్నా నుంచి నేను నిలదొక్కుకోవాలి. నా వెంట కెమెరాలు, నిర్జీవమైన ఆత్మను మాత్రమే తీసుకెళ్తున్నాను. తిరిగి వచ్చేవరకు.. మాతృభూమికి నా వీడ్కోలు’ అంటూ హైదరీ పెట్టిన పోస్టు హృదయాలను ద్రవింపజేస్తోంది. అలాగే విమానాశ్రయం వద్ద, భారమైన హృదయంతో వేచి ఉన్న చిత్రాన్ని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫ్రాన్స్ చేరుకున్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది.
హైదరీలాగే ఎంతో మంది అఫ్గాన్ మహిళలు, కుటుంబాలు తమ భవిష్యత్తును వెతుక్కుంటూ దేశం విడిచివెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)