Corona: మళ్లీ బుసకొడుతోన్న కరోనా.. ఆంక్షల చట్రంలోకి ప్రపంచ దేశాలు..!
ప్రపంచ దేశాలు మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంటున్నాయి. రికార్డు స్థాయి మరణాలతో రష్యా అల్లాడిపోతోంది. గంటల వ్యవధిలో భారీగా కేసులు పెరగడంతో సింగపూర్ ఉలిక్కిపడింది. జీరో టోలరెన్స్ పాలసీ అనుసరిస్తోన్న చైనా పదుల సంఖ్యలో వస్తోన్న కేసులను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. దాంతో పలు దేశాలు కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నాయి. మరికొన్ని ఆంక్షల ఛట్రంలోకి వెళ్లిపోతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాలు మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంటున్నాయి. రికార్డు స్థాయి మరణాలతో రష్యా అల్లాడిపోతోంది. గంటల వ్యవధిలో భారీగా కేసులు పెరగడంతో సింగపూర్ ఉలిక్కిపడింది. జీరో టోలరెన్స్ పాలసీ అనుసరిస్తోన్న చైనా పదుల సంఖ్యలో వస్తోన్న కేసులను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. దాంతో పలు దేశాలు కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నాయి. మరికొన్ని ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.
రికార్డు స్థాయిలో వైరస్ వ్యాప్తి.. మాస్కోలో లాక్డౌన్:
రష్యాలో కరోనా రికార్డు స్థాయిలో విజృంభిస్తోంది. దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం 1,159 మరణాలు వెలుగుచూశాయి. దాంతో మొత్తం మృతుల సంఖ్య 2.3 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 83 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం దేశరాజధాని మాస్కోలో గురువారం నుంచి 11 రోజుల పాటు లాక్డౌన్ విధించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తూ పుతిన్ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకోపక్క, దేశంలో అభివృద్ధి చెందిన స్పుత్నిక్ టీకాపై అక్కడి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ప్రజలు మాత్రం టీకా వేయించుకునే విషయంలో ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించలేదు. కేవలం 32 శాతం మంది మాత్రమే పూర్తిగా టీకాలు పొందారు.
చైనాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు..
కరోనా కట్టడికి జోరో టోలరెన్స్ పాలసీని అనుసరిస్తోన్న చైనా.. దేశీయంగా పదుల సంఖ్యలో వెలుగుచూస్తున్న కేసులకే కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈశాన్య చైనా సరిహద్దుల్లో కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది. రష్యాతో సరిహద్దు కలిగి ఉన్న ఆ ప్రాంతాల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆరు లక్షల మంది ఉన్న అక్కడి హీలాంగ్జియాంగ్ నగరంలో లాక్డౌన్ విధించింది. ఇప్పటికే లాంగ్జౌ, ఎజిన్ ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తోంది. ఒక్క కేసు వచ్చినా అక్కడి నగరాలు లాక్డౌన్లోకి వెళ్లిపోతున్నాయి. ఇక, ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా పరిమితులు విధించింది. నిఘా పెంచడంతో కొన్ని ప్రాంతాల్లో యుద్ధానికి ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుధవారం స్థానికంగా 23 మందికి కరోనా సోకింది. అక్టోబర్ 17 నుంచి ఆ సంఖ్య 270 కి చేరింది. ఫిబ్రవరిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ కూడా చైనా కఠిన వైఖరికి కారణమవుతోంది.
సింగపూర్కు ఏమైంది..
సింగపూర్లో రోజూవారీ కేసులు మొదటిసారి 5 వేల మార్కును దాటాయి. 24 గంటల వ్యవధి కంటే ముందే కొన్ని గంటల్లోనే ఈ స్థాయిలో కేసులు పెరగడంపై అక్కడి ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. బుధవారం మధ్యాహ్నం 12 కల్లా 5,324 మందికి కరోనా సోకింది. ‘ఈ రోజు ఇన్ఫెక్షన్ల సంఖ్య అసాధారణంగా చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం కొన్ని గంటల్లోనే ల్యాబుల్లో ఈ పాజిటివ్ కేసుల్ని గుర్తించాం. అందుకు గల కారణాల్ని అన్వేషిస్తున్నాం’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
బ్రిటన్లో కూడా డెల్టా ఉపరకం ay.4.2 కలవరం పుట్టిస్తోంది. అదే రకం భారత్లో కూడా వెలుగుచూసింది. మన దేశంలో ఆ రకానికి చెందిన 17 కేసుల్ని గుర్తించారు. రెండో వేవ్ ముగుస్తున్నప్పటి నుంచే మూడో వేవ్ గురించి ఆందోళనలు వెలువడ్డాయి. అయితే ఇటీవల కాలంలో కేసులు తగ్గడంతో ప్రజల్లో ఉదాసీనత కనిపిస్తోంది. అయితే పండగల సీజన్లో అప్రమత్తంగా ఉండకపోతే.. ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం కూడా కొవిడ్ మార్గదర్శకాలను నవంబర్ 30 వరకు పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?