Covishield: కొవిషీల్డ్‌ తీసుకున్న వారికే అమెరికాలోకి అనుమతి

రోనా టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది.

Updated : 22 Sep 2021 09:14 IST

దిల్లీ: కరోనా టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిబంధనకు లోబడి భారత్‌ సహా 33 దేశాల వారు తమ దేశంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. మన దేశంలో తయారైన టీకాల్లో కొవిషీల్డ్‌ తీసుకున్న వారినే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత శ్వేత సౌథం మరో ప్రకటన చేస్తూ... ఏ టీకా ఆమోదయోగ్యమో తుది నిర్ణయం తీసుకొనేది తమ దేశ ‘వ్యాధుల నియంత్రణ కేంద్రం’ (సీడీసీ) మాత్రమేనని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పటి వరకు ఏడు టీకాలను మాత్రమే గుర్తించింది. వాటిలో మోడెర్నా, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్‌(ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ఫార్ములా), చైనాకు చెందిన సినోఫార్మ్‌, సినోవాక్‌ టీకాలు ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిపరిచిన కొవాగ్జిన్‌ టీకాకు ఈ నెలలో డబ్ల్యూహెచ్‌వో అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

అక్టోబరులో 22 కోట్ల డోసులు..

తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని, వచ్చే నెలలో సుమారు 22 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని