Air pollution: వారి ఖాతాల్లో ₹5వేలు చొప్పున జమ చేస్తాం: కేజ్రీవాల్
దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం దృష్ట్యా భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం అరవింద్......
దిల్లీ: దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం దృష్ట్యా భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కో కార్మికుడి బ్యాంకు ఖాతాలో ₹5వేలు జమచేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు మీడియాకు వెల్లడించారు. అలాగే, నష్టపోయిన కార్మికులకు కనీస వేతనాల ప్రకారం పరిహారం కూడా అందజేయనున్నట్టు తెలిపారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో నగరంలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో నష్టపోయిన కార్మికులకు ఆర్థికసాయం అందించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కార్మిక శాఖకు ఆదేశాలు పంపినట్టు చెప్పారు. గురువారం నుంచి దిల్లీలో నిర్మాణ, కూల్చివేతలకు సంబంధించిన కార్యకలాపాలను మళ్లీ నిలిపేస్తున్నట్టు చెప్పారు. దీంతో ఆ రంగంలో పనిచేసే కార్మికుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరోవైపు, నిత్యావసరాలు రవాణా చేసే ట్రక్కులు మినహా మిగతా ట్రక్కుల ప్రవేశాలపై డిసెంబర్ 3వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులను నవంబర్ 27నుంచి దిల్లీలోకి అనుమతిస్తామని తెలిపారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్